AP: మంత్రి లోకేష్ పనితీరును హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల టీచర్ల జీతం పెంచుతామన్న ప్రకటనను అభినందించింది. పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన చేశారని వ్యాఖ్యానించింది. ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారని తెలిపింది. హాస్టల్ విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై వెంటనే స్పందించారని హైకోర్టు కితాబిచ్చింది.