TG: సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్బాల్ ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని.. కానీ రూ. 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.