కోల్కతాలోని సాల్ట్లేక్ స్టేడియంలో జరిగిన ఘటనపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, ఫ్యాన్స్కు సీఎం క్షమాపణలు చెప్పారు. కాగా మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ స్టేడియంలోకి కుర్చీలు, బాటిళ్లు విసిరేశారు. దీంతో స్టేడియానికి రాకుండానే సీఎం వెనుదిరిగారు.