ADB: జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిప్యూటీ కలెక్టర్ వంశీ, తహసీల్దార్ నారాయణ ఎంపీడీఓ సుధీర్, రిటర్నింగ్, ఇతర అధికారుల సిబ్బంది తదితరులు ఉన్నారు.