KRNL: దేవనకొండ మండలం కుంకనూరు గ్రామంలో జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెర్నేకల్ వెంకప్ప పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలు వివరించారు. బీసీ కాలనీలో రహదారి లేమి సమస్యను మహిళలు తెలియజేయగా, త్వరలో రహదారి నిర్మాణం చేపడతామని వెంకప్ప హామీ ఇచ్చారు.