ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి అధ్యక్షుడు సోయం బాపురావ్ అన్నారు. శనివారం బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామంలో అభివృద్ది జరుగుతుందన్నారు.