NLG: జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అ న్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న ప్రాతంల్లో శనివారం ఆమె పర్యటించారు. మాడుగుల పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.