TG: హైదరాబాద్కు చేరుకున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్కు బయల్దేరాడు. అక్కడ అతడిని కలిసేందుకు 250 మందికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫొటో సెషన్ ఉండనుంది. అతడిని కలిసేవారికి క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్కు సీఎం రేవంత్, రాహుల్ గాంధీ చేరుకున్నారు.