AP: బంగారు కోసం వృద్ధురాలిని హతమార్చిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లా ముడసర్లపేటలో జరిగింది. ముడసర్ల అప్పాయమ్మ(70) హత్య చేసి రెండు తులాల బంగారం దోచుకున్న దుండగులు.. ఆమె మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. కుటుంబసభ్యులు విజయవాడ వెళ్లడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దారుణం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.