NZB: రుద్రూర్ గ్రామ సర్పంచ్గా గెలుపొందిన ఇందూరు సునీత-ఇందూరు చంద్రశేఖర్ దంపతులు నేడు శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ, శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. సర్పంచ్ దంపతులకు శాలువా, పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.