MDK: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని 750 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు పేర్కొన్నారు. చేగుంట పోలీస్ స్టేషన్లో ఎన్నికల అవగాహన కార్యక్రమం చేపట్టారు. గర్భిణీ మహిళలు, వృద్ధులు వికలాంగులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.