NLG: శివనేనిగూడెం గ్రామ సర్పంచ్గా స్వర్గీయ నాగిళ్ల యాదయ్య గ్రామాన్ని అభివృద్ధి పరిచారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి సర్పంచిగా గెలుపొంది ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. శనివారం యాదయ్య వర్ధంతి సందర్భంగా గ్రామంలోని విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.