AP: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. 2026లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కూటమి నేతల మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు. రెడ్బుక్లో మిగతా పేజీలు తెరుస్తామంటూ మంత్రి లోకేష్ ఎవరిని బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగన్ ప్రభంజనం ఉండబోతోందన్నారు.