TG: SIB చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం అక్రమమని ఎంపీ ఈటల అన్నారు. ‘కాంగ్రెస్, BRS ఒక్కటే అనేలా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగుతోంది. జడ్జీలు, మంత్రులు, MLAల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగినట్లు విచారణలో చెబుతున్నారు. సిట్ విచారణ వేగవంతం చేసి, దోషులను శిక్షించాలి. లేదంటే కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయని భావిస్తాం’ అని స్పష్టం చేశారు.