TG: ప్రతిభావంతులైన దళిత విద్యార్థులకు అన్ని రంగాల్లో సమాన గౌరవం లభించాలంటే చదువు ఒక్కటే మార్గమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. HYDలోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ను మోడర్న్ కోచింగ్ హబ్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.