AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై మాజీ CM జగన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలన్నారు. కాగా, ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.