TG: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ను సమన్వయం చేసుకుని వారిని బుజ్జగించడంలో విఫలమైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 18 మంది ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.