AP: అమరావతిని ఆధునిక న్యాయనగరంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కోర్టులు, న్యాయశిక్షణ అకాడమీ, మధ్యవర్తిత్వ కేంద్రాలు, లీగల్ సర్వీసెస్ సంస్థలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రాక అమరావతికి కీలక అడుగు అని పేర్కొన్నారు. అమరావతిలో న్యాయ, మౌలికవసతుల బలోపేతానికి ఇది మైలురాయని చెప్పారు.