ELR: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం CI బి.వెంకటేశ్వరరావు, SI వి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పోలీసుల సూచనలతో పలువురు వాహనదారులు అక్కడికక్కడే హెల్మెట్లను కొనుగోలు చేశారు.