అన్నమయ్య: రామసముద్రం మండలం తిరుమలరెడ్డిలోని అమూల్ డైరీని బుధవారం ఉదయం పశువైద్యాధికారి డాక్టర్ పావని సందర్శించారు. పాల సేకరణ విధానం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, పాడి పశువుల ఆరోగ్యానికి సకాలంలో టీకాలు, పోషకాహారం అందించాలని రైతులకు సూచించారు. పాల ఉత్పత్తి పెంచి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.