ప్రపంచ అల్జీమర్స్ డేని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. అల్జీమర్స్ అనేది జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే మెదడు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, మెదడుకు వ్యాయామం, సామాజిక కార్యకలాపాలు వంటివి అల్జీమర్స్ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.