TG: చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డు ఉంటే రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు వస్తాయన్నారు. తమ ప్రభుత్వానికి మాదిగలు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామన్నారు.