AP: అనంతపురం ఉరవకొండలో చంద్ర మౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్తగారింటికి ముగ్గురు అల్లుళ్లు వెళ్లారు. మర్యాదల్లో భాగంగా మొదటి ఇద్దరు అల్లుళ్లకు అత్తింటి వారు కజ్జికాయలు పెట్టారు. అయితే మూడో అల్లుడు తనకు కజ్జికాయలు ఎందుకు పెట్టలేదు? ఇదేం మర్యాద? అని డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. దీంతో కానిస్టేబుల్ వచ్చి ముగ్గురు అల్లుళ్లకి కజ్జికాయలు పంచడంతో కథ సుఖాంతం అయింది.