AP: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏడుకొండలు కాదు.. రెండు కొండలు అన్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ గుర్తు చేశారు. పోరాటాలు చేసిన తర్వాత నాటి జీవోను మళ్లీ వెనక్కి తీసుకున్న పరిస్థితి చూశామని తెలిపారు. పింక్ పేరుతో అసత్య ప్రచారం, అభూతకల్పనలు చేసి అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు. కోర్టులో కేసు కూడా దాఖలు చేసి రూ.2 కోట్లు ఫీజు చెల్లించారన్నారు.