AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు భేటీ కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జల్జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణపై చర్చించారు. జల్జీవన్ మిషన్ కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.