హర్యానా కురుక్షేత్రకు చెందిన మన్దీప్ అరోరా అనే మహిళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. సంపన్న కుటుంబానికి చెందిన ఆమె పేద విద్యార్థులకు చదువు చెప్పేందుకు టీచర్ ఉద్యోగాన్ని వదిలేశారు. తన ఇంటినే విద్యా మందిరంగా మార్చి 15 ఏళ్లుగా ప్రతిరోజు సాయంత్రం వేళ ఉచితంగా 3 నుంచి 10వ తరగతి పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. 200 మంది పిల్లలకు ఉచిత విద్యనందించారు.