NTR: గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈనెల 27న హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ప్రజలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.