కార్తీక మాసం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో చాలామంది మాంసాహారం ముట్టకుండా శివుడికి పూజలు చేస్తారు. దీంతో చికెన్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.210 నుంచి రూ.250 వరకు ఉంది. 2, 3 రోజుల్లో భారీగా తగ్గుతాయని అంటున్నారు. రూ.250 నుంచి ఏకంగా రూ.170-180కి వచ్చే ఛాన్స్ ఉంది. రేట్లు తగ్గితే చికెన్ తినే వారికి పండగే.