TG: మేడ్చల్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లకుండా ఈటలను అడ్డుకున్నారు. ఏసీపీతో సహా ఈటల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు మోహరించారు. కాగా, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో.. పరామర్శకు వెళ్లేందుకు ఈటల సిద్ధమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని ఈటలను అడ్డుకున్నారు.