• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఆర్థికమంత్రి

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్ది గంటల్లోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్‌ను దాటి హిమాచల్ ప్రదేశ్‌లోకి చేరుకున్న మరుసటి రోజే ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో, ప్రభుత్వంలో తనకు అప్ప...

January 19, 2023 / 11:00 AM IST

మందేసి రెచ్చిపోయిన మీనా.. చెన్నై పోలీసులకు చుక్కలు

తమిళనాడులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్‌గా మందేసి రోడ్డుమీదకి రచ్చచేసింది. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రంకెన్ టెస్ట్ చేయనీవ్వకుండా హంగామా క్రియేట్ చేసింది. చెన్నైకి చెందిన మీనా స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. ఫుల్లుగా మందు తాగి, పార్టీ అయిపోయిన తర్వాత స్కూటీ మీద ఇంటికి బయలు దేరింది. సైదాపేట వద్ద పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరికిపోయింది. స్కూటీ తాళం చెవి ...

January 19, 2023 / 12:49 PM IST

కేరళ సీఎం అలా చేశాడేంటి, కమ్యూనిస్ట్‌ల టార్గెట్ అదొక్కటే?

కమ్యూనిస్ట్‌లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...

January 19, 2023 / 10:28 AM IST

జగన్ పెద్దనోట్లు దాచుకున్నాడు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల 500, 2000 నోట్ల రూపాయలు కనిపించడం లేదని, అన్నీ జగన్ ఇంటికి వెళ్లిపోయాయన్నారు. ఆ నోట్లను ఎక్కడికెక్కడికో పంపించ...

January 19, 2023 / 12:43 PM IST

బీఆర్ఎస్ వస్తే.. అగ్నిపథ్ ఉండదు : సీఎం కేసీఆర్

కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...

January 18, 2023 / 06:46 PM IST

‘తమిళనాడు’కు వ్యతిరేకిని కాదు, వ్యాఖ్యలను వక్రీకరించారు: గవర్నర్ ఆర్ఎన్ రవి

తమిళనాడు పేరు గురించి గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో గవర్నర్ రవి బుధవారం వివరణ ఇచ్చారు. తమిళనాడుకు వ్యతిరేకిని కాదని ఆయన స్పష్టంచేశారు. తమిళనాడు పేరు మార్చాలని సూచించిన వార్తలు అవాస్తవం అన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా అనుబంధం ఉందన్నారు. అందుకోసమే తమిళగం అనే పదాన్ని వాడానని తెలిపారు. చారిత్రక సందర్భ...

January 18, 2023 / 06:43 PM IST

మోడీ గారూ! మీ పాలసీ అదేనా.. నన్ను వేధిస్తోంది: కేసీఆర్ హెచ్చరిక

భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ […]

January 18, 2023 / 06:11 PM IST

ప్రధాని మోడీకి ప్రజల మీద ధ్యాస లేదు : కేజ్రీవాల్

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...

January 18, 2023 / 05:19 PM IST

బీజేపీకి కంటిరోగం వచ్చింది.. ఒకటే రంగు కనిపిస్తోంది

పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...

January 18, 2023 / 05:20 PM IST

మన టాస్క్ అదొక్కటే.. బీజేపీపై ఊగిపోయిన డీ రాజా

గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...

January 18, 2023 / 06:13 PM IST

బీజేపీని తరిమికొడదాం.. రోజులు లెక్కబెడుతోంది: అఖిలేష్ యాదవ్

బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...

January 18, 2023 / 06:12 PM IST

మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేరళ సీఎం

ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతి...

January 18, 2023 / 06:11 PM IST

టీడీపీ ఒక పార్టీ మాత్రమే కాదు..: బాలకృష్ణ

తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...

January 18, 2023 / 02:54 PM IST

తెలంగాణపై బీజేపీ లెక్క సరిపోతుందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కా...

January 18, 2023 / 02:27 PM IST

బైక్‌పై కపుల్ రొమాన్స్: ముద్దుల్లో ముంచెత్తిన మగువ, కేసు నమోదు

పబ్లిక్ ప్లేసులో హుందగా ప్రవర్తించాలి, బైక్ లేదంటే కారులో ఉన్నప్పుడు చక్కగా ఉండాలి. కొందరు అలా ఉండటం లేదు.. రెచ్చిపోతున్నారు. ట్రావెల్ చేసే సమయంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో వీడియో వచ్చింది. ఓ జంట పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోయింది. లక్నోలో గల హజరత్ గంజ్‌లో బైక్ వెళుతున్న యువతీ, యువకుడు డ్రైవ్ చేస్తూ రొమాన్స్ చేశారు. వారి చేష్టలను ఒకర...

January 18, 2023 / 02:14 PM IST