టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని శివనాథ్కు లోకసభ టిక్కెట్ ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోను సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. అతనితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చినా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా పార్టీలో పని చేయవచ్చు… పోటీ కూడా చేయవచ్చునని, కానీ క్రిమినల్స్, ల్యాండ్, సెక్స్ మాఫియా గ్రూప్లకు టిక్కెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తి లేదన...
బడ్జెట్ కి సమయం అయ్యింది. త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే… ఈ బడ్జెట్ మధ్య తరగతి ప్రజలకు అనుగుణంగా ఉండనుందని తెలుస్తోంది. ఆ మాటలను బట్టి ఈసారి మధ్య తరగతి ప్రజలను దృష్టిలోకి ఉంచుకొని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు మధ్యతరగతి ప్రజల జీవితాల గురించి తెలుసని, తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినేనని ని...
చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేయడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం అన్నారు. పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పని అయిపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ప్రజలు తనకు బుద్ధి చెప్పడం కాదని,...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ప్రత్యేక బస్సు వారాహితో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. బస్సుకు 24వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, అనంతరం ఆలయ...
పాకిస్తాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వరదలతో ఆహార ఉత్పత్తి తగ్గడం, విదేశీ నిల్వలు లేక దిగుమతులు ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. పరిస్థితి ఏ స్థాయికి చేరుకున్నదంటే గోధుమపిండి కోసం కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (PTI) అధికార షెహబాజ్ షరీఫ్ పైన విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, గతంలో ప్రధాని మోడీ ...
2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...
బీజేపీలో చేరడం అంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లే అంటూ… మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… ఆయన ప్రతిపక్షం పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని, బీజేపీలో చేరినవాళ్లు ఆత్మహత్య చేసుకున్న...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు వచ్చాయి. ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం గమనార్హం. అతను.. తాను దావూద్ గ్రూప్ కి చెందినవాడినని చెప్పడం గమనార్హం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావి జైలు నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారిగా పోలీసులు గుర్తించారు.ఓ హత్య కేసులో కోర్టు జయేష్ కు మరణశిక్ష విధించింది. నాగ్పూర్ ...
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...
తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటాడని చెప్పారు. డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం వంటివి తమ కుటుంబానికి అలవాటు లేని విషయాలు అన్నారు. గతంలో చేసిన రాజకీయాలకు, నేటి రాజకీయాలకు ఏమాత్రం ప...
కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయిలోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో… ఆ వాహనంలో ఉన్న పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… కేంద్ర సహాయక మంత్రి అశ్విని చౌబే ఆదివారం రాత్రి బక్సర్ నుండి పాట్నాకు వెళుతుండగా, ఆయన అశ్వికదళంలో భాగమైన పోలీసు జీపు బోల్తా పడింది...
బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి సాధించిందన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఉమ్మ...
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం దవాఖానాలో చేరారు. కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందారు. ఆ తర్వాత నిమోనియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లలిత్ మోడీ ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స తీసుకుంటున్నారు. వారంలో తనకు రెండుసార్లు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఇన...
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప...
కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మ...