ADB: నార్నూర్ మండలంలోని బోధి బుడోకాన్ కరాటే అసోసియేషన్ విద్యార్థులు HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు బయలుదేరారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నట్లు మాస్టర్లు ముకేశ్, రాము తెలిపారు. జిల్లాస్థాయిలో సత్తా చాటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొత్తం 13 విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.