Sapta Sagaralu Dhaati Movie Explanation Rakshit Shetty Rukmini
Sapta Sagaralu Dhaati: బ్లూ కలర్ దారం నేత మగ్గం నేస్తుండగా అందమైన మెలోడి సాంగ్ తో సినిమా టైటిల్స్ పడుతుంటాయి. సినిమా బెంగళూరులో జరుగుతుంది. మను కొంచెం స్లోగా వెళ్లు అనే వాయిస్ తో సీన్ మొదలు అవుతుంది. బెంజ్ కార్లో మను, ప్రియా వెళ్తుంటారు. మను చాలా ఫాస్ట్ గా కారును నడుపుతుంటాడు. ప్రియా మెళ్లిగా వెళ్లు అంటుంది. మను అలాగే వెళ్తుంటే మను కారు ఆపు అని దిగి వెళ్లిపోతుంది ప్రియా. దాంతో మను బుజ్జి అని పిలుస్తాడు ప్రియా ఆగుతుంది. అలా ఫాస్ట్ గా నడుపుతున్నావు కారుకు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి, నీకు వచ్చే జీతం కేవలం 12 వేలే.. ఈ కారు వ్యాల్యూ చేయాలంటే నువ్వు 80 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది అని కొప్పడుతుంది. అలా ఏం జరగదు అని సారీ చెప్పి సెకండ్ హ్యండ్ కొనాలంటే జస్ట్ 40 ఏళ్లు పని చేస్తే చాలు అని జోక్ చేస్తాడు. ఇద్దరు మళ్లి కార్లో వెళ్తుంటే తన ప్రాక్టీస్ గురించి అడిగి ఒక పాట పాడు అంటాడు. దానికి ప్రియ అలిగి ఎప్పుడు పడితే అప్పుడు సింగర్స్ పాడరు, దానికి ఒక మూడు ఉంటుంది అని అంటుంది. దానికి మను తన వాయిస్ చాలా బాగుంటుందని, తిట్టినా కూడా అలానే వినాలనిపిస్తుందని అంటాడు. దాంతో గాడిదా అని ముద్దుగా తిడుతుంది ప్రియ. కారు ఆగుతుంది. దిగిపోతున్న ప్రియాతో ట్యాక్సీ కట్టాలి అని తనను కిస్ చేస్తాడు. తరువాత ప్రియ వెళ్లిపోతుంది. తనకు బాయ్ చెప్పి కారును ఒక చోట ఆపి డ్రైవర్ డ్రెస్ ఛేంజ్ చేసుకొని వాళ్ల ఓనర్ శంకర్ గౌడ ఇంటికి వెళ్లి ప్రభుకు కారు కీసు ఇచ్చేస్తాడు.
చదవండి:Mrunal Thakur: ఆ హీరోతో ప్రేమలో పడిపోయా!
కట్ చేస్తే మను మార్నింగ్ నిద్రలేచి ఎదురుగా ఉన్న ఒక అపార్ట్ మెంట్ ను చూస్తూ ఉంటాడు. తరువాత సీన్లో మను శంకర్ గౌడ ఇంట్లో టిఫిన్ చేస్తాడు. తరువాత కారును తీసుకొచ్చి ప్రీతూకు ఇస్తాడు. మరో కారు డోర్ తీస్తాడు. ఇంకో కార్లో తన యజమానిని తీసుకొని ఫ్యాక్టరీకి వెళ్తాడు. తరువాత గల్లీలో నుంచి మను నడుచుకుంటు వెళ్లాడు. మరో సీన్లో ప్రియా తన గ్రూప్ తో మ్యూజిక్ క్లాస్ లో సాంగ్ పాడుతుంది. అక్కడికి మను వచ్చి విజిల్ వేసి హాయ్ చెప్తాడు. ప్రియా కడలిని చేరే పరుగుగా అనే సాంగ్ ను పాడుతుంది. అక్కడికి మ్యూజిక్ డైరెక్టర్ భార్గవ్ వచ్చి చూస్తాడు. సాంగ్ అయిన తరువాత మను క్లాప్స్ కొడుతాడు. తరువాత మను దగ్గరకి ప్రియా వచ్చి విజిల్ వెయోద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు, గాడిదా అంటుంది. దానికి నీ వాయిస్ వింటే ఆగలేను అంటుండగా అక్కడి మ్యూజిక్ డైరెక్టర్ భార్గవ్ అసిస్టెంట్ హ్యాండి వచ్చి తాను చాలా బాగా పడారని సర్ చెప్పాడని, భార్గవ్ కార్డు ఇచ్చి ఒకసారి సర్ మిమ్మల్ని స్టూడియోలో కలవమన్నారని చెప్పి వెళ్తాడు. కార్డు తీసుకొని ప్రియా, మను ఇద్దరు చూసి నవ్వుకుంటారు.
నెక్ట్స్ మను ఆఫీస్ కు వెళ్తాడు అక్కడ అకౌంటెంట్ ప్రభు ఎందుకు లేటు అని అడుగితే ట్రాఫిక్ అంటాడు మను. తరువాత డబ్బులు అడిగి సాలరీ రాగానే ఇస్తా అంటాడు. నెక్ట్స్ సీన్లో ప్రియా ఇంట్లో టీ తాగుతూ అమ్మా అని పిలుస్తుంది. ఇంట్లో నుంచి వచ్చి తన తల్లి ఒక డబ్బను ఇస్తే దాన్ని ప్రియా బ్యాగులో పెట్టుకుంటుంది. అది చూసి ప్రియా తమ్ముడు వినోద్ చూడడానికి ప్రయత్నిస్తాడు. మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే రూమ్ ఎందుకు, దానికి అద్దే కట్టాలి కదా అని తల్లి అంటుండగా బైక్ హార్న్ వినిపిస్తుంది. మను వచ్చాడు ఈవినింగ్ లేట్ అవుతుందని చెప్పి వెళ్లిపోతుంది. బాక్స్ లో ఏం పెట్టావు అని తల్లిని అడుగుతాడు వినోద్. కట్ చేస్తే బాక్స్ లోంచి నల్లపూసల తాడును మెడలో వేసుకుని ఇళ్లు చూడడానికి వెళ్తారు. ఒక ఇంట్లో ఎక్కువ చీకటిగా ఉంటుంది. అది ప్రియాకు నచ్చదు. తరువాత ఇంట్లో వెంటిలేటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరో ఇళ్లును చూడడానికి వెళ్తారు. అలా కొన్ని ఇళ్లులు వెతికాక ఒక ఫ్లాట్ కు వెళ్తారు. అక్కడ బ్లూ కలర్ గోడలు ప్రియాకు చాలా బాగా నచ్చుతాయి. కాని అక్కడ ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. మరో సీన్లో ఇద్దరు పఫ్ తింటుంటారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు పఫ్ తినడం రాదు అని మను అంటుంటాడు. అయితే ఇది కూడా నువ్వే తిను అంటుంది. ఆ రూమ్ చాలా బాగుంది అని ప్రియా అంటే బ్లూ కలర్ గోడలు నచ్చాయి కదా నీకు అని నెక్ట్స్ చూసే ఇళ్లు పక్కగా వర్క్ అవుట్ అవుతుంది అని మరో ఇంటికి వెళ్తే డోర్ తెరవగానే స్మెల్ వస్తుంది. అక్కడినుంచి రోడ్డుపై వెళ్తూ ఒక అపార్ట్ మెంట్ ను చూస్తాడు. వద్దురా అంటుంది ప్రియా కలలు కనడానికి ఖర్చు ఏం కాదుగా అని అలానే చూస్తాడు. తరువాత ఒక అపార్ట్ మెంట్ లో రూమ్ చూడడానికి వెళ్తారు. అక్కడ బాల్కనీ నుంచి సిటీని చూస్తూ తమ ఫ్యూచర్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసినట్లు చెప్తాడు. తరువాత అక్కడ మేనేజర్ మరో అపార్ట్ మెంట్ చూస్తారా అని అడిగితే అదేం వద్దు అని వెల్లిపోతారు. నువ్వు ఊరెళ్లి వచ్చేలోపు మంచి ఇల్లు చూసి పెడుతా అని మను అంటాడు.
కట్ చేస్తే మను వాళ్ల అమ్మా తమ్ముడితో బస్ స్టాప్ లో ఉంటుంది. బస్సు బయలు దేరుతుంది. కిటిలోంచి ఫింగర్ క్రాస్ చేస్తూ ఒక సింబల్ పెడతుంది ప్రియా. మను కూడా అలాగే చేస్తాడు. మను కిటికీలోంచి చూస్తూ వెళ్తుంది. ఫ్లాఫ్ బ్యాక్ లో ప్రియా ఒక చోట కూర్చొని ఉంటుంది. అక్కడి వాళ్ల నాన్న వస్తాడు. తనకు బెంగళూర్ వెళ్లడం ఇష్టం లేదని అక్కడ సముద్రం ఉండదు అని చెప్తే వాళ్ల నాన్న ఒక శంఖాన్ని చేవుదగ్గర పెట్టి నువ్వు ఎక్కడికెళ్లినా సముద్ర ఘోష వినిపిస్తూనే ఉంటుంది అని, నీలోనే ఒక సముద్రం ఉంటుంది అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తాడు. కట్ చేస్తే అక్కడికి ప్రియా వస్తుంది. సముద్రం ఒడ్డున నడుస్తూ మనుకు ఫోన్ చేస్తుంది. కార్లో కూర్చున్న మను ఫోన్ మాట్లాడుతుంటాడు. అంతలో మేడమ్ వచ్చింది అని తరువాత చేస్తే అంటే ప్రియా నువ్వు ఫోన్ కట్ చేయద్దు.. కేవలం నేను మాట్లాడేది విను అంటుంది. కారు ఎక్కిన మేడమ్ నువ్వు ఎప్పుడు చూసిన ఫోన్లో నే ఉంటావు అని అంటుంది. తరువాత మను హెడ్ సెట్ పెట్టుకొని కారు డ్రైవ్ చేస్తాడు. బెంగళూర్ లో ఎప్పడూ ట్రాఫిక్ సౌండే వినిపిస్తుంది. ఇది విను అని సముద్ర ఘోషను వినిపిస్తుంది. సముద్ర పక్కనే ఇల్లు కట్టుకుందామని, అలల శబ్దం వింటుంటే చాలా సంతోషంగా ఉంటుందని, ఇప్పుడు పాడాలని అనిపిస్తుంది అని, నీతో ఉన్నప్పుడు కూడా నాకు ఇలానే ఉంటుంది అని నా సముద్రానివి నువ్వు అని ముద్దుపెట్టి ఫోన్ పెట్టేస్తుంది.
తరువాత సీన్లో రాత్రి మను ప్రియా ఇచ్చిన శంఖాన్ని చేవుదగ్గర పెట్టుకొని కాసేపు వింటాడు. నెక్ట్స్ సీన్లో ప్రభుకు వాళ్ల ఓనర్ ఫోన్ చేస్తాడు. తిట్టుకుంటునే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ సర్ అంటాడు ప్రభు.. గుర్రాలా ఫామ్ ని నీటిగా క్లిన్ చేయించు అని అంటాడు. అలాగే సర్ ఫోన్ పెట్టేసి మళ్లీ తిడుతాడు. అక్కడ బకెట్ కింద పడుతుంది. అక్కడికి మను వస్తాడు. అన్నా నిన్ను ఒక విషయం అడగాలి అని మీ ఊర్లో ఇళ్లు సముద్రం దగ్గరే ఉంటుందా.. సముద్రం పక్కన ఇళ్లు కట్టాలి అంటే ఎంత అవుతుంది అని అడుగుతాడు. దానికి ప్రభు అసహనంతో చూసి జీవితాంతం కష్టపడ్డా 5 సెంట్ల స్థలం కొనలేకపోతున్నా.. వీడు బీచ్ లో ఇల్లు కడుతాడంటా అనుకుంటూ త్వరాగా రా ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం అంటాడు.
కట్ చేస్తే ప్రియా సినిమా టెకెట్లు తీసుకొని మనుకు ఫోన్ చేస్తుంది. కారు క్లీన్ చేస్తూ మను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వస్తున్నావా అంటే వస్తున్నా ప్రామిస్ అంటాడు. ప్రామిస్ ను నమ్మను అంటుంది. లేదు వస్తున్నా అంటాడు. కారు ఫాస్ట్ గా డ్రైవ్ చేయకు అని పెట్టేస్తుంది. కట్ చేస్తే కారు ఫాస్ట్ గా వెళ్తుంది. ఒక అతను అడ్డం వస్తే కారుతో డ్యాష్ చేస్తాడు. గాళ్లో ఎగిరి కిందపడుతాడు అతను. కారు ఆగుతుంది. మళ్లీ కారు వెనక్కి వచ్చి అతన్ని కారు ఎక్కించి కారు ఫాస్ట్ గా వెళ్లిపోతుంది. అంతలో అక్కడికి నాన్నా అంటూ వాళ్ల పాప వస్తుంది. అక్కడ కారు నెంబర్ ప్లేట్ కొంచెం ముక్క పడిఉంటుంది. దాన్ని పోలీసు తీసుకొని సీసీ కెమెరాను చూస్తాడు. అక్కడికి మీడియా అంతా వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. శంకర్ గౌడా మీటింగ్ లో ఉండగా అక్కడికి తన అసిస్టెంట్ వచ్చి చేవులో విషయం చెప్తాడు. కట్ చేస్తే శంకర్ గౌడా కొడుకు ప్రితూ భయంతో ఏడుస్తుంటాడు. అక్కడికి తన తల్లి వచ్చి జరిగిందేదో జరిగిపోయింది వెళ్లి స్నానం చేసిరా అంటుంది. ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుతారు. అక్కడికి తల్లి వచ్చి డబ్బు గురించి ఆలోచించకండి ప్రితూ మాత్రం దీనినుంచి బయటపడాలి అంటుంది. దాంతో సీసీ కెమెరాలో రికార్డు అయింది మనం ఏం చేయలేము అని లాయర్ అంటాడు. దానికి వాళ్లమీద అరుస్తుంది. దాంతో శంకర్ గౌడ తనను అరవకు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇంట్లో కారు డ్రైవింగ్ చేసే సిద్దప్పను తన కొడుకు బదులు జైల్ కు పంపిద్దాం అనుకుంటాడు. దానికి అతను చేశాడు అంటే ఎవరు నమ్మరు అని ప్రభు చెప్తాడు. మరేం ఏం చేద్దాం అని శంకర్ గౌడ అడుగుతాడు.
కట్ చేస్తే ఇదే డీలింగ్ విషయం మనుతో చెప్తాడు ప్రభు. కేవలం మూడు నెలలు జైళ్లో ఉంటే చాలు 15 లక్షలు ఇప్పిస్తాని, ఎన్ని రోజులు కష్టపడితే అంత డబ్బు వస్తుందో ఆలోచించుకో అంటాడు ప్రభు. ఒప్పుకుంటే మన సార్ అంతకన్నా ఎక్కువే ఇస్తాడు అని చెప్తాడు. దానికి మను ఆలోచనలో పడుతాడు. ప్రభు మను దగ్గరకు వచ్చి మంగళూరు బీచ్ పక్కనే ఇళ్లు కట్టుకునే విషయాన్ని గుర్తు చేస్తాడు. తాను ఆలోచించుకొని చెప్తా అని వెళ్లి పడుకొని ఆలోచిస్తాడు.
తరువాత సీన్లో మను, ప్రియా కలిసి ఒక ఇంటిని చూస్తారు అది వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇంట్లోకి వెళ్తాడు. ప్రియా పూజ చేస్తుంది. మను ఏదో చెప్పాలని చూస్తాడు. కాని చెప్పడు. ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకుంటారు. తరువాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది ప్రియా. తాను ఏం లేదని చెప్తాడు. తరువత ఇద్దరు ఒక చోట కూర్చోని ఒకరిభుజం మీద ఒకరు తల పెట్టుకొని అలా ఉండిపోతారు.
నెక్ట్స్ సీన్లో మనును శంకర్ గౌడ దగ్గరకు ప్రభు తీసుకెళ్తాడు. అక్కడ శంకర్ గౌడ మను ఓపినీయన్ అడుగుతాడు. ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అంటే 6 నెలలు అంటాడు. దానికి మను ఆలోచనలో పడుతాడు. టైమ్ వేస్ట్ చేయకు అని ఓనర్ అనే సరికి మను 35 లక్షలు అని అడుగుతాడు. దానికి ప్రభు మందలిస్తాడు. ఓనర్ దానికి ఒప్పుకుంటాడు. 3 లక్షలు అడ్వాన్స్ ఇస్తాడు. తరువాత బస్సులో ఉన్న ప్రియా దగ్గరకు వెళ్లి డబ్బు తన బ్యాగులో పెట్టి తనతో చెప్తాడు. కట్ చేస్తే ప్రియా ఏడ్చుకుంటూ వెళ్తుంది. తరువాత తనను కన్విన్స్ చేసి నేను వేళ్తా అని చెప్తాడు. తను వెళ్లొద్దు అని చెప్తుంది. కాని మను వెళ్లాల్సిందే అని వెళ్లిపోతాడు. తరువాత మనును పోలీసులు తీసుకెళ్తాడు. ప్రియా బాధపడుతూ ఏడుస్తుంది. మీడియా వాళ్లను లోపలికి రావద్దని పోలీసులు కేసు గురించి మాట్లాడుతారు. తరువాత సీన్లో ఇంట్లో టీవీ చూస్తుంది ప్రియా తల్లి. దాంతో ప్రియా అక్కడికి వచ్చి టీవీ కట్టేసి లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. డోర్ ఎంత కొట్టినా తీయదు, అన్నం తినదు. రాత్రి అందరూ పడుకున్న తరువాత తినుకుంటూ టీవీ చూస్తుంది ప్రియా. బాధ పడుతుంది.
నెక్ట్స్ సీన్లో నన్ను చూడడానికి ఎవరన్నా వచ్చారా అని మను పోలీసులను అడిగితే ఎవరూ రాలేదని చెప్తాడు కానిస్టేబుల్. తరువాత మను బాధపడుతూ ఆలోచిస్తాడు. కిటికోలోంచి చూస్తాడు. నెక్ట్స్ సీన్లో తినడానకి పార్సల్ ఇస్తున్న పోలీసుతో ఒక్క ఫోన్ కాల్ చేసుకోవచ్చా అని ప్రియాకు ఫోన్ చేస్తాడు. కాని ప్రియా మాట్లాడదు. మను బాధపడుతుంటాడు. మను ఇచ్చిన బ్యాగ్ ను చూసి పక్కన పడేస్తుంది. తరువాత సీన్లో ఎస్ఐ అసలేం జరిగిందో రాయమని చెప్తాడు. అది చించి పడేసి లాయర్ ను రమ్మని సైన్ పెట్టిస్తాడు. తరువాత మను ప్రియా కోసం ఎదురుచూస్తుంటాడు కోర్టులో. జడ్జీ చార్ట్ షీట్ రెడీ చేయండి బెయిల్ గురించి అప్పుడు చూద్దాం అని చెప్తాడు. దాంతో మనును పోలీసులు తీసుకెళ్తుండగా ప్రియా తన చేయి పట్టుకుంటుంది. తనతో మట్లాడుతుండగా పోలీసులు మనును తీసుకెళ్తారు. జీపులో ఎక్కించుకొని వెళ్తుంటే ప్రియా ఫింగర్స్ క్రాస్ చేసి సింబల్ ను చూపిస్తుంది. దానికి మను కూడా ఫింగర్ క్రాస్ చేస్తాడు.
నెక్ట్స్ సీన్లో పోలీసు స్టేషన్ లో ఎలా ఉండాలో అక్కడి జైలర్ వివరిస్తుంటాడు. కాదు కూడదు అని ఎవరన్నా ఎక్కువ చేస్తే కొడుతామని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో ఖైదీలు అంతా సెల్ లోకి వెళ్తే అక్కడ సీనియర్లు వారిని ఇబ్బంది పెడుతారు. మను మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఖైదీలను కొందరు ఇబ్బంది పెడుతుంటారు. తరువాత సీన్లో మనును సొమన్న దగ్గరకు తీసుకెళ్తాడు. తాను మనుతో మాట్లాడుతాడు. ఇది ప్రసూతి కేంద్రం అని ఇక్కడికి వచ్చిన వారికి పునర్జన్మ ఉంటుందని అలాగే పురిటినొప్పులు పడాల్సిందే అని చెప్తాడు. తరువాత మనుకు జైల్ గురించి అన్ని చెప్తాడు సోమన్న. అక్కడ పటేల్ ను చూపించి వాడితో జాగ్రత్తా అంటాడు. తరువాత కొందరు సరకు క్యాచ్ పడుతాడు. జైల్ లోపల లక్షల వ్యాపారం సాగుతుంది అని ఇక్కడ సీనియర్ ఖైదీలు పోలీసుల్లా ప్రవర్తిస్తుంటారు అని చెప్తాడు. మనుకు మంచి విషయాలను చెప్తాడు సొమన్న. అయితే మను కోసం వచ్చేవాళ్లను ఎక్కడ కలువాలి అని సొమన్నను అడుగుతాడు.
కట్ చేస్తే ప్రియా మను కోసం ఉప్మా చేస్తుంది. బస్సులో తన కోసం వెళ్తుంది. తరువాత ఆటోలో స్టేషన్ వెళ్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ జైల్ కు వెళ్తుంది. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తుంది. అక్కడ మను కూడా వెయిట్ చేసి లైన్ లో వస్తాడు. ప్రియాను చూసి పిలుస్తాడు. ఇద్దరు కలిసి చూసుకుంటారు. ఎలా ఉన్నావు గాడిదా అంటుంది. ఇద్దరు నవ్వుకుంటారు. అంతలో టైమ్ అయిందని మనును లాక్కెళ్లుతారు. ప్రియాను కూడా పోలీసులు వెళ్లమని చెప్తారు. మనును కొడుతుంటారు. తరువాత సీన్లో ప్రియా టిఫిన్ బాక్స్ ను కడుగుతూ ఆలోచిస్తుంది. జైల్ లో బట్టలు ఉతుకుతున్న మను దగ్గరకు సొమన్నా వచ్చి మనుకు ఫోన్ ఇప్పిస్తా శంకర్ గౌడకు ఫోన్ చేసి డబ్బులు అడగమని చెప్తాడు. తరువాత సీన్లో ఫోన్ ఇస్తాడు, ప్రభుకు ఫోని చేసి మాట్లాడుతాడు. తరువాత ప్రియాకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. తన చేతులకు దెబ్బలు ఉంటాయి ఫోన్ పెట్టేసి ఏడుస్తాడు. తరువాత ఎస్ఐ పిలిచాడని మనును తీసుకెళ్తాడు. అక్కడికి శంకర్ గౌడ వచ్చి మాట్లాడుతాడు. లాయర్ ప్రశాంత్ చెప్పినట్లే చెప్పు అని ఇక మీదట జైల్ లో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో కోర్టు బోనులో మను ఉంటాడు. కారు నడిపింది నువ్వేనా అని, ఎవరు బలవంతం చేయలేదుగా అని జడ్జీ అడుగుతాడు. దానికి మను అన్ని ఒప్పుకుంటాడు. దాంతో మిగితా ప్రొసిజర్ చూడండి అంటాడు జడ్జీ. అదే విషయాన్ని ప్రభు ఫోన్ చేసి యజమానికి చెప్తాడు. మనుకు ఏ లోటు రాకుండా చూసుకో అని చెప్తాడు శంకర్ గౌడ. అదే విషయాన్ని సోమన్నాకు చెప్తాడు మను. సోమన్నా ఏదో ఆలోచిస్తాడు. మరో సీన్లో ఓనర్ శంకర్ గౌడా వ్యాయామం చేస్తూ పడిపోతాడు. తరువాత సీన్లో ప్రియా తమ్ముడిపై స్కూల్ టీచర్ కంప్లైంట్ చేస్తుంది. అదే సమయంలో ప్రియా న్యూస్ ఛానెల్ లో శంకర్ గౌడకు హార్ట్ ఎటాక్ వచ్చిందనే న్యూస్ ని చూసి అప్సెట్ అవుతుంది. అదే మూడ్ లో ఉండంగా సింగింగ్ కాంపిటేషన్ లో పాల్గొంటుంది. ఫర్మార్మెన్స్ చేయకుండా వెళ్లిపోతుంది. అలా వెళుతూ బాధపడుతుండగా అక్కడికి తన తల్లి, తమ్ముడు వచ్చి ఓదారుస్తారు.
చదవండి:Surya: కాలేజీ కుర్రాడి లుక్లో కనిపించనున్న హీరో సూర్య!
తరువాత సీన్లో జైల్లో ములాకత్ కోసం ప్రియా వస్తుంది. తనను కలుస్తాడు మను. షో గురించి అడుగుతాడు. ప్రియా మౌనంగా ఉంటుంది. దానికి ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే శంకర్ గౌడా చనిపోయాడు అని చెప్తుంది. ముందు నమ్మని మను తారువాత బాధపడుతాడు. ఆయన మంచి వాడు ఇచ్చిన మాట తప్పడు అని మాట్లాడుతాడు. ప్రభు అన్నతో మాట్లాడవా అంటే తాను ఫోన్ లిఫ్ట్ చేయలదని చెప్తుంది. తరువాత అంతా మంచే జరుగుతుంది అని మను వెళ్లిపోతాడు. తరువాత సోమన్న గ్యాంగ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ వారు మను ఎందుకు డల్ గా ఉన్నాడని అడుగుతారు. అందరూ టాయిలెట్ కడుగడం గురించి గొడవపడుతారు. సోమన్నా ఏం జరిగింది అని అడుగుతే శంకర్ గౌడ చనిపోయిన విషయం చెప్తాడు. దాంతో ఒక్కసారిగా మనును బయటకు గెంటేస్తాడు. తరువాత మనుతో టాయిలెట్స్ కడగించమని చెప్తాడు. మరో సీన్లో మనును సోమన్నా గ్యాంగ్ కొడుతారు. మను మీద సొమన్నా ఉమ్మేసి వెళ్తాడు. తరువాత టాయిలెట్స్ కడుగుతాడు. బట్టలు ఉతుకుతాడు. అలా జైల్ లో కష్టాలు పడుతుంటాడు. తరువాత విజిటింగ్ రూమ్ లో మనుతో ఏం జరిగిందని ప్రియా అడుగుంది. తరువాత సీన్లో ప్రభును ప్రియా అడుగుతుంది. దానికి ఏదో సమాధానం చెప్తాడు. మరో సీన్లో ఇంటి అద్దే అతను తిడుతాడు. తరువాత ప్రియా వచ్చి కానిస్టేబుల్ కు డబ్బులు ఇస్తుంది. దాంతో వేరే బ్యారెట్ కు షిఫ్ట్ చేస్తాడు జైలర్. తరువాత సీన్లో జైల్ లో ఒకడు సూసైడ్ చేసుకుంటాడు. దాన్ని చూసిన సోమన్న గ్యాంగ్ నవ్వుతారు. మను కోపంగా చేస్తాడు. దాన్ని పటేల్ చూస్తాడు.
తరువాత సీన్లో శంకర్ గౌడ దినం జరుగుతుండగా అక్కడికి లాయర్ వచ్చి మిసెస్ శంకర్ గౌడాతో మను బెయిల్ గురించి మాట్లాడితే తాను ఓకే అంటుంది. తరువాత ప్రభు వచ్చి మను బయటకు వస్తే ప్రీతమ్ కు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి లాయర్ తో బెయిల్ కాన్సిల్ చేయిస్తాడు. తరువాత ప్రభు కొంచె పెత్తనం చూపిస్తాడు. కోర్టు సీన్లో మనుకు బెయిల్ రాదు దాంతో మను ఆలోచనలో పడుతాడు. అంతలో అక్కడివచ్చి ప్రియా ఒక లెటర్ ఇస్తుంది. అది చదివేలోగ ఒకడు దాన్ని నమిలి ప్రియాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాడు. తరువాత జైల్ లో కూడా అతడు కామెంట్ చేస్తాడు. దాంతో మను రాయి పట్టుకొని కొడుదామని వెళ్తుండగా పటేల్ వచ్చి మనును ఆపుతాడు. దాంతో మను రాయి కిందపేడేసి వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో ప్రియా లాయర్ ప్రశాంత్ ను కలుస్తుంది. అతను చూసి చూడకుండా వెళ్లిపోతుంది. తరువాత సీన్లో మను పని చేయడానికి మగ్గం మిషన్ల దగ్గరకు వెళ్లాడు. అక్కడ పటేల్ ఉండి అందరి నేరాలను చెప్తూ మనును అడుగుతాడు. అతడు ఏం తప్పు చేశావు అని అడుగుతాడు. దానికి మను ఏం తప్పు చేయలేదు అని చెప్తాడు. దాంతో పటేల్ మనుకు పని ఇవ్వడు. ప్రియా మిసెస్ శంకర్ ను కలువడానికి వెళ్తుంది. అలాగే లాయర్ ను కలుస్తుంది. తాను ఎగ్జామ్స్ లో కాన్సెట్రేషన్ చేయలేకపోతుంది. ప్రభు ఇంటికి వస్తే అతను కొత్త కారు కొంటాడు. కోపంతో కారుపై రాయి విసిరి పోతుంది.
మరో సీన్లో ప్రియా మరో లాయర్ ను కలుసి మాట్లాడుతుంది. తాను ట్రై చేద్దాం అంటాడు.
కట్ చేస్తే కోర్టులో సీసీ టీవీ ఫుటేజ్ ను చూపిస్తారు. తరువాత చనిపోయిన కూతుర్ని విచారిస్తారు. ఆ రోజు కారు నడిపింది నువ్వు చూశావా అని అడిగితే లేదు అని చెప్తుంది. అలాగే తన తండ్రికి న్యాయం చేయండి అంటుంది. జైల్ లో పటేల్ దగ్గరికి వెళ్లి హిట్ అండ్ రన్ కేసు అని ఒప్పుకొని పనిలో చేరుతాడు మను. పటేల్ అతనికి కొన్ని మంచి మాటలు చెప్తాడు. మనం మనిషిగా పుట్టలేదు మనిషిగా మారడానికి పుట్టామని చెప్తాడు. మరో సీన్లో ప్రియా కూడా జాబ్ లో జాయిన్ అవుతుంది. అలా ఇద్దరు కష్టపడుతుంటారు. తరువాత సీన్లో ప్రియా కళ్లల్లో నిజమైన ప్రేమ కనిపించిందని తోటి ఖైదీ చెప్తాడు. తరువాత మను చూడడానికి ప్రియా వచ్చినప్పుడు ఫింగర్ క్రాస్ పెట్టి ఇద్దరు నవ్వుకుంటారు. మను మగ్గం పని చేస్తుంటాడు. నెక్ట్స్ సీన్లో ప్రియా వాళ్ల అమ్మకు తెలియకుండా గాజులు తీసుకెళ్తుంది. అదే సీన్లో వాళ్ల అమ్మ ఒక పెట్టే తెరిచే చూస్తి అందులో గొళుసు ఉండదు.
తరువాత సీన్లో కోర్టులో ప్రియా, మను ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. తనకు బయటకు వస్తానా రానా అని డౌట్ గా ఉందని అంటాడు. మనం ప్రయత్నం చేద్దాం ఈ లాయర్ మంచోడు అని చెప్తుంది. తరువాత ఇంకో నెలరోజులు పడుతుంది అని కేసు వాయిదా వేస్తారు. నెక్ట్స్ సీన్లో ప్రియాతో వాళ్ల అమ్మా ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తావ్ అంటుంది. దానికి కొప్పడుతుంది ప్రియా, ఎన్ని సంవత్సరాలు అయినా వెయిట్ చేస్తా అంటుంది. మను రూమ్ కాళి చేయించాలి అని ఫోన్ రావడంతో అతని రూమ్ కె వెళ్లి అన్ని గుర్తు చేసుకుంటుంది ప్రియా. నెక్ట్స్ సీన్లో లాయర్ మనుతో కొన్ని సంతకాలు పెట్టించి తనకు ఒక క్యాసెట్ ఇచ్చి వెళ్తాడు. దాన్ని చెకింగ్ లో దొరకకుండా తీసుకొని వెళ్తాడు మను.
జైల్ లో మీటింగ్ జరుగుతుంది. అక్కడ టెపురికార్డును తీసుకొని మను తన పనిచేసే టోటుకు వెల్లి దాన్ని దాచిపెడుతాడు. అతన్ని ఫాలో అవుతూ ఒక ఖైదీ అక్కడికి వస్తాడు. అతను వెళ్లిపోయిన తరువాత ప్రియా ఇచ్చిన క్యాసెట్ ను వింటుంటాడు. ప్రియా మాట్లాడిన మాటలు వింటుంటాడు. అంతలో అక్కడికి ఖైదీలు వచ్చి పని చేస్తారు. తరువాత ప్రియా పాడుతుంది. అది వింటూ మను బాధపడుతాడు. అలా ఇద్దరు తమ పాస్ట్ ను ఊహించుకొని బాధపడుతుంటారు. తరువాత నా కోసం ఎప్పుడు వచ్చినా వెయిట్ చేస్తాను పది సంవత్సరాలు అయినా సరే అని రికార్డు వినిపిస్తుంది. తరువాత కోర్టులో ఇద్దరూ మాట్లాడుకుంటారు. అలా టేప్ లో తన కల గురించి చెప్తుంది. జైల్ లో మను ఉలిక్కిపడుతాడు. మరో సీన్లో జైల్ కు ప్రియా వాళ్ల అమ్మా వచ్చి తాను కూడా జైల్ లోనే ఉందని, ఏదోటి చేయి బాబు అని ఏడుస్తుంది. ఆ మాటలతో చేసేది ఏం లేక కోపంతో చేతికి గాయం చేసుకుంటాడు మను. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు. వాటర్ ట్యాంకర్లో కూర్చుంటాడు. బండిని చెక్ చేసి పంపిస్తారు. ఇక బయటకు వెళ్తున్న అనే సమయంలో డాక్టర్ కు మను పారిపోయిన విషయం తెలుస్తుంది. ఖైదీ ఎస్కేప్ అయినట్లు సమాచారం తెలిసి కోడ్ రెడ్ ను వేస్తారు. అలా వాటర్ ట్యాకంర్ ను చెక్ చేసి మనును పట్టుకొని లోపల వేస్తారు. తానొక్కడే కూర్చిని ఏడుస్తాడు. తరువాత బయటకు వస్తాడు. ప్రియా కోసం లెటర్ రాస్తాడు. నా కోసం వెయిట్ చేయడంలో అర్థం లేదు అని నువ్వు మంచి సింగర్ కావాలని, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి అని లెటర్ రాస్తాడు.
నెక్ట్స్ ములాకత్ లో తన కళ్లలోకి చూస్తూ ఉండిపోతాడు. పాడటం ఆపొద్దు అని చెప్తాడు. తాను వెళుతూ తిరగి చూస్తుంది. ఫింగర్స్ క్రాస్ చేసి వెళ్తుంది. కట్ చేస్తే ప్రియా లెటర్ చదివి ఏడుస్తుంది. మనును కలవడానకి జైల్ కు వస్తుంది. కాని మను వెళ్లడు. ప్రియా చూసి వెళ్లిపోతుంది. తరువాత బస్సులో వెళ్తూ బాధ పడుతుంది. ములాకత్ కు వస్తుంది. అది తోటి ఖైదీ చూసి మనుకు చెప్తాడు. తరువాత సీన్లో పటేల్ ను మీరేతప్పు చేశారు అని అడుగుతాడు. దానికి పటేల్ నేను చేసిన తప్పుకు శిక్ష మాత్రమే ఉంది అని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో ప్రియా తన తల్లితో తట్టుకోలేకపోతున్నా అని వెక్కివెక్కి ఏడుస్తుంది. మనును మరిచిపోవడం నా వాళ్లా కాదు అని ఏడుస్తుంది. తల్లి ఓదారుస్తుంది. ప్రియా మనును కలవాడినికి వెళ్తూనే ఉంటుంది. కాని మను కలువడు. వెళ్దాం అనుకుంటాడు కాని వెళ్లడు. ప్రియా కూడా తన కంట్రోల్ తప్పి హోం వర్క్ చేయనందుకు తమ్ముడిని కొడుతుంది. తాను తప్పు చేయనట్లు సరైన సాక్షాలు లేనందునా మనుకు పది సంవత్సరాల జైల్ శిక్షపడుతుంది.
చదవండి:Thalapathy Vijay ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..స్పెషల్ షోలు లేవని ప్రకటన
దాంతో ప్రియాకు వేరే సంబంధం చూస్తుంది వాళ్ల అమ్మ. ప్రియా సుసైడ్ చేసుకోవాలినుకుంటుంది. మనును జైల్ లో సోమన్న మనుషులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అదే సమయంలో జైల్ లో ఒక కార్డు సిస్టమ్ వచ్చి వారానికి ఒక రోజు 5 నిమిషాలు కుటుంబంతో మాట్లాడుకోవచ్చిని చెప్తారు. దాంతో మను ప్రియా ఇంటికి ఫోన్ చేస్తే వినోద్ లిఫ్ట్ చేస్తాడు. ప్రియా పెళ్లి విషయం చెప్తాడు. అది విని నేనే ఫోన్ చేసిన విషయం ప్రియాకు చెప్పకు అని మాట తీసుకుంటాడు. కట్ చేస్తే వినోద్ ప్రియాతో చెప్తాడు. జైల్ లో మను సోమన్నను కొడుతాడు. ప్రియా పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. జైల్ సొమన్నను తన గ్యాంగ్ ను కొడుతూ ఉంటాడు మను. ప్రియా పెళ్లి చేసుకుంటుంది. తరువాత ఖైదీలు అందరు కలిసి మనును కొడుతుంటారు. అందరూ గుమికూడి చూస్తుంటారు. మను కిందపడిపోతాడు. ప్రియా పెళ్లి కార్యక్రమం అయిపోతుంది. మను ఆసుపత్రికి తీసుకువెళ్తారు. ప్రియా తన ఫస్ట్ నైట్ గదిలో ఉంటుంది. డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. డోర్ తీస్తుంది. ఆసుపత్రిలో పటేల్ మనుతో తన భార్యను చంపిన విషయం గురించి చెప్తాడు. ఇక్కడ ఉండడం నీ వల్ల కాదు అని వేరే జైయిల్ మార్చమని జైలర్ తో చెప్పిన విషయం చెప్తాడు. పది సంవత్సరాల తరువాత మను జైల్ శిక్షపూర్తి అవుతుంది. జైయిల్ నుంచి బయటకు రాగానే సైడ్ ఏ కంప్లీట్ అవుతుంది. తరువాత సైడ్ బీ పడుతుంది. రాబోయే పార్ట్ లో ఏం జరగబోతుందో కొన్ని సీన్లు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తారు. ఇది సప్తసాగరాలు దాటి సినిమా కథ.