పాకిస్తాన్ బెట్టింగ్ వెబ్సైట్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నటి మల్లికా షెరావత్కు ఈడీ సమన్లు జారీ చేసింది. హీరోయిన్లు మల్లికా, పూజా బెనర్జీ వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. పోర్టల్ ‘మ్యాజిక్విన్(MagicWin)’ చట్టవిరుద్ధంగా పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రసారం చేసింది. ఈ పోర్టల్పై దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ఇటీవల ఢిల్లీ, ముంబై సహా పూణేలలో ఈడీ ...
దర్శకులపై నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్లు మహిళలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. గీతాంజలి, శ్రీవల్లి పాత్రలు చాలా బలమైనవని, అలాంటి పాత్రలను తెరపై చూపాలంటే ధైర్యం కావాలని అన్నారు. కాగా, రష్మిక.. సందీప్ రెడ్డితో ‘యానిమల్’, సుకుమార్తో ‘పుష్ప 1,2’ సినిమాలు చేశారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై స్పెషల్ డాక్యుమెంటరీని రూపొందించగా.. ‘RRR బి హైండ్ అండ్ బియాండ్’ అని పేరు పెట్టారు. సుమారు గంటన్నర నిడివి ఉన్న ఈ సిరీస్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎంపిక చేసిన స్క్రీన్లలో స్పెషల్ షోలు వేస్తున్నారు. బుక్ మై షోలో టికెట్లను అందుబాట...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘ది రాజాసాబ్’. ఈ మూవీలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నిధి అగర్వాల్కు సంబంధించిన ఫొటో వైరల్ కాగా.. అది ‘రాజాసాబ్’ లీక్డ్ పిక్ అంటూ పలువురు దాన్ని వైరల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై నిధి స్పందించింది. అది మూవీకి సంబంధించిన ఫొటో కాదని క్లారిటీ ఇచ్చింది. యాడ్ షూట్ ఫ...
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తోన్న మూవీ ‘రామాయణ’. తాజాగా ఈ సినిమాపై నటుడు ముఖేష్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాముడి పాత్రలో నటించే వారు రావణుడిలా కనిపించకూడదని చెప్పారు. ఆ పాత్రలో నటించినన్ని రోజులు కొన్ని అలవాట్లు మార్చుకోవాలని తెలిపారు. కాగా, ఈ మూవీకి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 2026 దీపావళికి ఈ మూవీ మొదటి భాగం, 2027 దీపావళికి...
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ ‘ఇండియన్ 2’. ఎన్నో అంచనాల మధ్య విడుదలై పరాజయం పొందింది. ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ రివ్యూలపై శంకర్ స్పందించారు. ఈ విధంగా రివ్యూలు వస్తాయని అసలు ఊహించలేదన్నారు. ‘గేమ్ ఛేంజర్’, ‘ఇండియన్ 3’తో అద్భుతమైన చిత్రాలను అందించాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకు కొన్ని డైలాగ్స్ను తమిళనాడు ఎంపీ వెంకటేశన్ రాశారట. మధురై MPగా ఉన్న ఆయన.. తమిళంలో డైలాగ్స్ రాసినట్లు సమాచారం. ఇక దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గత కొన్నిరోజులుగా ఈ మూవీ వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాణ సంస్థ SLV సినిమాస్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి అని తెలిపింది. భవిష్యత్లో ఈ మూవీ అప్డేట్స్, ప్రకటనలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడిస్తామని పేర్కొంది...
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్.. ప్రమోషన్స్ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. మోడర్న్ డ్రెస్లో మేడలో పసుపు తాడుతో కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘బేబీ జాన్’ ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’తో ఈ సినిమా పోటీ పడబోతుందని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై దర్శకుడు అట్లీ స్పందించారు. ‘పుష్ప 2 డిసెంబర్ మొదటివారంలో రిలీజ్ కాగా ఈ సినిమా చివరి వారంలో విడుదలవుతుంది. వాటి మధ్య పోటీ ఎందుకు ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలని బన్నీ కోరుకున్నారు. మా టీంకు...
కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. తాజాగా ఆయన చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కాగా, ఈ నెల 24న ఆయనకు ట్రీట్మెంట్ జరగనుంది.
డేటింగ్ రూమర్స్పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని చెబుతానని తెలిపారు. సెలబ్రిటీని కావడం వల్ల తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారని, దాన్ని తాను తప్పుగా భావించనని పేర్కొన్నారు. కాగా, రష్మికా మందన్నతో విజయ్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో పి. మహేష్ బాబు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. RAPO22 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నయా అప్డేట్ వచ్చింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రాబోతుందట. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
ఈ ఏడాదిలో పలువురు సినీ ప్రముఖ జంటలు విడిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, సైరా బాను దంపతులు పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. హీరో జయంరవి, ఆర్తి విడిపోయారు. సంగీత దర్శకుడు GV ప్రకాష్, సైంధవి.. బాలీవుడ్ నటి ఇషా డియోల్, భరత్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఊర్మిళ మంటొద్కర్, తన భర్త మెహిసిన్ అక్తర్ నుంచి విడాకులు కోరుతూ కేసు నమోదు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా.. హీరో ధనుష్, ఐశ్యర...