తమిళ నటుడు విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 1’ సినిమాకు సీక్వెల్గా ‘విడుదల 2’ రాబోతుంది. ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దీని విడుదలకు ముందు ‘విడుదల 1’ను OTTలో ఫ్రీగా చూడొచ్చని ‘జీ5’ ప్రకటించింది. ఈ ఛాన్స్ ఈ నెల 20 వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఇక దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాక...
అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుంది. తాజాగా దీని ప్రోమో రిలీజ్ కాగా.. ఈ సీజన్ ప్రైజ్మనీ రూ.54,99,999 అని నాగార్జున ప్రకటించారు. దాన్ని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్తో పాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వేడుకలో ఎక్స్ కంటెస్టెంట్స్, పలువురు సెలబ్రిటీలు పాల్గొన...
అక్కినేని నాగచైతన్య, నటి శ్రీలీల జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల కనిపించనున్నట్లు సమాచారం. ‘తండేల్’ రిలీజ్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అలాగే శ్రీలీల అక్కినేని అఖిల్తో కూడా సినిమా చేయబోతుందట.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్’. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. ఈ క్రమంలో చిరు నివాసానికి బయలుదేరారు. బన్నీ అరెస్టైన విషయం తెలియగానే షూటింగ్ని మధ్యలోనే ఆపేసి.. అల్లు ఫ్యామిలీని కలిసేందుకు చిరంజీవి వెళ్లారు. అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అవటానికి చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. దీనిపై స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు. బన్నీను చూసి ఆయన భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయిన వీడియోను ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. ‘ఇప్పుడు నేనేమీ ఏడవడం లేదు ఓకే’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. దానికి అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను ట్యాగ్ చేశారు.
తన పెళ్లి గురించి నటి తాప్సి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లు తన పెళ్లి ఈ ఏడాది జరగలేదన్నారు. తమ పెళ్లి గతేడాది డిసెంబర్లోనే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. త్వరలోనే మా పెళ్లి రోజు రాబోతుంది. ఇవాళ నేను ఈ విషయాన్ని బయటపెట్టకపోతే ఎవరికీ దీని గురించి తెలిసేది కాదు’ అని పేర్కొన్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలోని మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. రేపు లెజెండరీ లాలెట్టన్ మోహన్ లాల్ మొదటి గ్లింప్స్ వచేస్తున్నాయని మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-8 షో ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నట్లు వార్తలు రాగా.. ఆయన సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఈ షోకు రావడం లేదట. ఇక ఈరోజు రాత్రి 10 గంటలకు విన్నర్ను ప్రకటిస్తారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘RC-16’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటిస్తున్నట్లు సమాచారం. నెగిటివ్ రోల్లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
జర్నలిస్ట్పై దాడి కేసులో నటుడు మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదని పోలీసులు తెలిపారు. వారి కుటుంబసభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారని చెప్పారు. మోహన్ బాబు ఎక్కడున్నారో సమాచారం లేదని వెల్లడించారు. అయితే ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. తాను పరారీలో లేనని, త్వరలో అందుబాటులోకి వస్తానని నిన్న మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆయన గన్ను సీజ్ చేసేందుకు పోలీసు...
‘రాజావారు రాణివారు’ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. ‘క’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా కిరణ్.. రెమ్యూనరేషన్ రూ.2 కోట్ల వరకు పెంచినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదివరకు రూ.3 కోట్లు లేదా రూ.4 కోట్ల పారితోషికం తీసుకునే ఆయన.. ఇప్పుడు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
అక్కినేని అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇందులో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేశారట. ఇక అన్నపూర్ణ, సితార బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే వారం హృతిక్పై ఓ సోలో సాంగ్ చిత్రీకరణకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ముంబై శివార్లలో సెట్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత ఎన్టీఆర్పై యాక్షన్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆయన ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై జనవరిలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇక ప్రభాస్.. ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నారు.