మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించటం తగదని అన్నారు. కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయని పేర్కొన్నారు. త్వరలో అవన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. అయితే మంచు కుటుంబంలో విబేధాల నేపథ్యంలో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ డాబాకు సంబంధించిన చీటింగ్ కేసులో ఆయనతో పాటు మరో ఇద్దరికి నోటీసులిచ్చింది. గరం ధరమ్ దాబా ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెడతానని చెప్పి మోసం చేశారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కోర్టు సమన్లు జారీ చేసింది.
తమిళ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్పై KE జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే ఈ మూవీ వసూళ్లను అంతగా రాబట్టలేక పోయింది. దీంతో నిర్మాత కోసం సూర్య మంచి నిర్ణయం తీసుకున్నారట. మూవీ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆయనతో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.
తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులందరినీ అమెరికా నుంచి వెళ్లగొడతానని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మాత్రం మార్గం మరింత సులువు చేస్తానని చెప్పారు. ఇది భారతీయులకు శుభవార్త కావచ్చు. అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలన్నారు.
మంచు ఫ్యామిలీలో విబేధాల నేపథ్యంలో రెండు కేసులు నమోదయ్యాయి. మంచు మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవటంతో చర్యలు తీసుకున్నట్లు పహాడీషరీఫ్ పోలీసులు తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మనోజ్తో పాటు భార్య భూమా మౌనికపై కేసు పెట్టారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదైంది.
తమిళ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘తంగలాన్’ మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ మూవీ షూటింగ్ను మొదలుపెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇక హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అంద...
కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదని మంచు మనోజ్ తెలిపారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందిస్తూ.. ‘కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశా. కొంతకాలంగా నా కుటుంబం దూరంగానే ఉంటుంది. విష్ణు అనుచరులే నా ఇంటి సీసీఫుటేజీ మాయం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థల్లోని బాధితులకు నేను అండగా ఉన్నందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అని పే...
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ లోడ్ అవుతుందని, తర్వలోనే దీన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఇది ...
పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘OG’. అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ మేరకు సెట్స్లో డైరెక్టర్ ఫొటోను మేకర్స్ నెట్టింట షేర్ చేశారు. DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్...
ఏపీ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఈ క్రమంలో ‘మంత్రి పదవికి మీరు అర్హులు సార్’ అంటూ తాజాగా బేబి మూవీ నిర్మాత SKN ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్స్ విషయంలో తగ్గేదే లే అంటుంది. అక్కడ మూడు రోజుల్లో $8 మిలియన్ల మార్క్ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తి మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మనోజ్ ఏకంగా గాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. కొన్ని మీడియా సంస్థలు ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నాయంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ ప్రకటన విడ...
నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. రేపు రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. అయితే రేపు ఉదయం 11.07లకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ దీన్ని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,...