సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూవీ జనవరిలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ను అలరించేందుకు మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిందీలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్ వైరల్గా మారింది. అక్కడ 2:27 గంటల రన్ టైంతో ఈ సినిమా రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప...
యూత్ను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. మొత్తం మూడు పార్ట్లతో వచ్చిన ఈ సిరీస్ ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, దివ్యేందు ఈ సినిమాలో నటనతో అభిమానుల నుంచి ప్రశంసలు పొందారు.
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తమన్నా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 15ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. ప్రస్తుతం తన కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. 2005లో మంచు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’ సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. అగ్ర హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు తదితరులతో సినిమాలు చేసింది. తన అందం, నటన, డ్యాన్స్తో ప్రేక్షకుల మనసును క...
మలయాళ హీరో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 5న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ రన్ టైంను పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 3:20 గంటల నిడివితో వచ్చిన ఈ సినిమా 18 నిమిషాల మేర టైంను జోడించి ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో 3డి వెర్షన్లో రిలీజ్ చేయనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళ గిల్లి సినిమా తెలుగులో పోకిరికి రీమేక్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మికా మందన్న చెప్పారు. తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా గిల్లి అని, అందులో ఓ పాట తనకెంతో ఇష్టమని తెలిపారు. అయితే ఆ సినిమా మహేష్ బాబు నటించిన ఒక్కడుకి రీమేక్ కావడంతో నెటిజన్లు రష్మిక వీడియోను వైరల్ చేశారు. ఈ విషయంలో సారీ చెబుతూ రష్మిక సరదా పోస్ట్ పెట్టారు. ‘అవును గిల్లి ఒక్కడుకి రీమేక్. ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నా.. [&...
ఈ ఏడాది టాలీవుడ్లో సీక్వెల్ సినిమాలు చాలా వచ్చాయి. సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, నారా రోహిత్ ‘ప్రతినిధి-2’, అంజలి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, శ్రీసింహా ‘మత్తు వదలరా-2’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాలతో పాటు ఇతర భాషల్లో కమల్ ‘ఇండియన్-2’, విజయ్ సేతుపతి ‘విడుదల-2’ వచ...
దర్శక దిగ్గజం రాజమౌళికి తమిళ డైరెక్టర్ అట్లీ పోటీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అట్లీ ‘అవుట్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ తన 6వ సినిమాను ప్రకటించారు. ఈ క్రమంలో రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సవాల్ విసిరేలా ఈ చిత్రం వస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లను తీసుకువస్తున్నారట. రాజమౌళి సినిమా కంటే ముందు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్ల...
‘అమరన్’ మూవీ డైరెక్టర్ రాజ్కుమార్ పెరియస్వామి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందీలో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ మూవీని భూషణ్ కుమార్ నిర్మించనున్నారట. ఈ మేరకు వీరిద్దరి మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
విలన్ పాత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ తన సొంత దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫతేహ్ జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూ అరుంధతి సినిమాలోని పశుపతి క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లోనే బాగా కష్టపడ్డ పాత్ర అని అన్నాడు. మేకప్కే ఆరేడు గంటలు పట్టేదన్నాడు. మేకప్ ద్వారా దద్దుర్లు వచ్చాయని వెల్లడించాడు.
‘పుష్ప-2’ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తోన్న విషయం తెలిసిందే. అలాంటి వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ తాజాగా స్పందించింది. సినిమా ఓటీటీ రిలీజ్పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. థియేటర్లో విడుదలైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని.. ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేసింది.
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇవాళ OTTలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్. ఈ ఏడాది అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇవాళ OTTలో ఎంట్రీ ఇచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే పొట్టేల్ మూవీ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. హిందీ బాక్సాఫీసు వద్ద రూ.632 కోట్లు (నెట్) దక్కించుకొని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన 15 రోజుల్లోనే అంత మొత్తాన్ని కలెక్ట్ చేసింది.