• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ఢిల్లీ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో తనపై, తన కుటుంబంపై నెగిటివ్ ప్రచారాలతోపాటు కించపరుస్తూ పలు వెబ్‌సైట్‌లు కథనాలు ప్రచురించాయని.. తన ఫొటోలు, వాయిస్‌ను గూగుల్, సోషల్ మీడియాలో వాడొద్దని పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ హైకోర్టు మోహన్ బాబు కంటెంట్‌ను గూగుల్ నుంచి తొలగించాలని తీర్పునిచ్చింది.

December 21, 2024 / 04:59 PM IST

జగన్‌కు విషెస్ చెప్పిన రాంగోపాల్ వర్మ

AP: వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.

December 21, 2024 / 03:17 PM IST

అగౌరవంగా అనిపించి ఏడ్చేశా: నటి

బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మందిరా బేడీ గతంలో క్రికెట్ ప్రజెంటర్‌గా పని చేశారు. తాజాగా దీనిపై మందిర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘2003లో వరల్డ్ కప్‌కు నేను ప్రజెంటర్‌గా పనిచేశా. తొలివారం రోజులు ఎంతో కంగారుపడ్డా. క్రికెట్ లెజెండ్స్‌తో మాట్లాడే సమయంలో నేను అడిగిన ప్రశ్నకు కాకుండా వాళ్లకు నచ్చిన జవాబు చెప్పేవారు. అది నాకు అగౌరవంగా అనిపించింది. ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ఏడ్చ...

December 21, 2024 / 03:15 PM IST

వ్యూహం మూవీకి లీగల్ నోటీసులు

AP: వ్యూహం మూవీకి లీగల్‌ నోటీసు ఇచ్చినట్లు ఫైబర్‌గ్రిడ్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి తెలిపారు. రూ.2.15 కోట్ల ఒప్పందం చేసుకుని రూ.1.15 కోట్ల చెల్లింపులపై నోటీసులు ఇచ్చామని, వ్యూస్‌ ప్రకారం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ, 1,863 వ్యూస్‌ మాత్రమే ఉన్నాయని, ఈ లెక్కన ఒక వ్యూకు రూ.11 వేల చొప్పున చెల్లించారని తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్‌ నోటీస్&zwnj...

December 21, 2024 / 03:13 PM IST

సినిమా నచ్చకపోతే పైసల్ రిటర్న్

ప్రముఖ మల్టీఫ్లెక్స్ PVR Inox తన ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్లో మూవీ నుంచి మధ్యలోనే వెళ్లిపోతే డబ్బును రిఫండ్ చేయనుంది. కానీ, మొత్తం అమౌంట్ కాకుండా సినిమా చూసిన టైం వరకు ఛార్జ్ చేసి మిగతాది ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే.. దీనికి టికెట్ ధరపై 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఢిల్లీలో అమలు చేయనున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగత నగరాలకు విస్తరించనున్నారు.

December 21, 2024 / 02:17 PM IST

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్

ప్రముఖ మల్టీప్లెక్స్ PVR INOX తన ఆడియెన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్లో మూవీ నుంచి మధ్యలోనే వెళ్లిపోతే డబ్బును రిఫండ్ చేయనుంది. కానీ, మొత్తం అమౌంట్ కాకుండా సినిమా చూసిన టైం వరకు ఛార్జ్ చేసి మిగతాది ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే.. దీనికి టికెట్ ధరపై 10 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఢిల్లీలో అమలు చేయనున్నారు. అక్కడ సక్సెస్ అయితే మిగతా నగరాలకు విస్తరించనున్నారు.

December 21, 2024 / 02:17 PM IST

మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాలో ప్రభాస్‌, సమంత

మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితాను ఆర్మాక్స్‌ మీడియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 10 మంది నటీనటుల లిస్ట్‌లో టాప్‌ వన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సమంతా రూత్ ప్రభు ఉన్నారు. షారుఖ్ ఖాన్,విజయ్, జూ. ఎన్టీఆర్, నయనతార, అలియా భట్ సహా దీపికా పదుకొణె ఈ జాబితాలో చేరారు.

December 21, 2024 / 01:54 PM IST

‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌పై సాలిడ్ బజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్రైలర్‌పై సాలిడ్ బజ్ నెలకొంది. ఈ నెల 27న జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారట. ఆయన చేతుల మీదుగా ఇది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవర...

December 21, 2024 / 01:46 PM IST

ఫ్యాన్స్‌ను ఎప్పుడూ నిరాశపరచను: రామ్‌ చరణ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని డల్లాస్‌లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను ఎప్పుడూ నిరాశపరచనని తెలిపారు. తన సోలో సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతుందని, కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన...

December 21, 2024 / 01:21 PM IST

రూ.100 కోట్లు ఇచ్చినా అత్తగా చేయను: నటి

‘గదర్ 2’లో అత్తయ్య పాత్రలో కనిపించమంటే నటి అమీషా పటేల్ చేయనన్నారని దర్శకుడు అనిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా దీనిపై అమీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు. ‘మూవీలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది పూర్తిగా నా అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. రూ.100 కోట్లు ఇచ్చినా మీ సినిమా అనే కాదు ఏ సినిమాలోనూ అత్త పాత్ర చేయను’ అంటూ రాసుకొచ్చారు.

December 21, 2024 / 01:10 PM IST

షారుఖ్‌తో వివాదం.. 9ఏళ్ల సింగర్‌ స్పందన

ప్రముఖ సింగర్ హనీ సింగ్‌పై బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ దాడి చేశారని 9ఏళ్ల క్రితం వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై హనీ సింగ్ స్పందించారు. ‘షారుఖ్‌కు నేనంటే చాలా ఇష్టం. ఆయన నన్ను కొట్టలేదు. ఒకసారి మేము US టూర్‌కు వెళ్లాము. అయితే వరుస ఈవెంట్స్‌తో చాలా అలసిపోయాను. అక్కడ మరో ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా.. అది నాకు ఇవ్వాలనిపించలేదు. దాని నుంచి తప్పించుకోవడం కోసం నాపై నేనే దాడి చేసుకున...

December 21, 2024 / 12:42 PM IST

షారుఖ్‌తో వివాదం.. 9ఏళ్ల తర్వాత సింగర్‌ స్పందన

ప్రముఖ సింగర్ హనీ సింగ్‌పై బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ దాడి చేశారని 9ఏళ్ల క్రితం వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై హనీ సింగ్ స్పందించారు. ‘షారుఖ్‌కు నేనంటే చాలా ఇష్టం. ఆయన నన్ను కొట్టలేదు. ఒకసారి మేము US టూర్‌కు వెళ్లాము. అయితే వరుస ఈవెంట్స్‌తో చాలా అలసిపోయాను. అక్కడ మరో ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా.. అది నాకు ఇవ్వాలనిపించలేదు. దాని నుంచి తప్పించుకోవడం కోసం నాపై నేనే దాడి చేసుకున...

December 21, 2024 / 12:42 PM IST

‘మీర్జాపూర్‌’ సినిమాపై అలీ ఫజల్ కామెంట్స్

త్వరలోనే ‘మీర్జాపూర్‌’ వెబ్ సిరీస్ సినిమాగా రాబోతుంది. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమాలో నాతో పాటు పంకజ్, త్రిపాఠి, దివ్యేందు, అభిషేక్ బెనర్జీ కనిపిస్తారు. ఈ సిరీస్ 3 భాగాల్లో చనిపోయిన వారంతా సినిమాలో చాలాసేపు కనిపిస్తారు. దీనికోసం నా లుక్‌ను కూడా మార్చుకుంటున్నాను. ఈ సిరీస్‌ల ప్రారంభానికి ముందు ఏం జరిగిందో మూవీలో చూప...

December 21, 2024 / 12:16 PM IST

‘గేమ్ ఛేంజర్’ ధోప్ పాట రిలీజ్ ఎప్పుడంటే..?

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇటీవల ఈ సినిమా నుంచి ధోప్ పాట ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ ఫుల్ పాట రేపు రాత్రి 8:30 నిమిషాలకు రిలీజ్ చేస్తుండగా.. అమెరికాలోని డల్లాస్‌లో జరిగే ఓ ఈవెంట్‌లో దీన్ని ఇవాళ రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున...

December 21, 2024 / 11:52 AM IST

సందీప్ రెడ్డి వంగాపై రిషబ్ శెట్టి ప్రశంసల వర్షం

‘కాంతార’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సినిమాలో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆయనలా ఎవరూ ఆలోచించలేరని, దూరదృష్టి ఉన్న దర్శకుడని చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు.   

December 21, 2024 / 11:46 AM IST