రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీ 2026 మార్చి 19న విడుదల కానుంది. ‘ధురంధర్’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ రన్ టైం 3:40 గంటలుగా లాక్ చేసినట్లు టాక్. మొదటి భాగం(3:34 గంటలు)తో పోలిస్తే 6 నిమిషాలు ఎక్కువట.
ప్రభాస్, సందీప్ వంగా క్రేజీ కాంబో ‘స్పిరిట్’ నుంచి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో వివేక్ సరసన కనిపించిన నటి గురించే చర్చ నడుస్తోంది. ఆమె ఇండో-అమెరికన్ నటి ఐశ్వర్య దేశాయ్. ‘గల్లీ బాయ్’ ఫేమ్ అయిన ఈ నటి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్, ఆమె కలిసి ప్రభాస్ను గట్టిగా ఢీకొట్టబోతున్నారని టాక్.
హిందీ నిర్మాత దీపక్ ముకుత్ త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాబీ డియోల్, అభిషేక్ బచ్చన్ కాంబోలో ‘దో ఔర్ దో పాంచ్’ సినిమాను రీమేక్ చేయాలని ఆయన పదేళ్లుగా భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు హీరోల క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాని, సుజీత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ తాజాగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, నానిల ఫోటోను షేర్ చేయడంతో తన ‘సినిమాటిక్ యూనివర్స్’పై హింట్ ఇచ్చినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గనుక ‘సాహో’, ‘OG’ సినిమాలతో లింక్ అయితే నాని కెరీర్లోనే భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారనే వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో, ఇతర అప్డేట్స్లో ఆయన పేరు లేకపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. గతంలో ఆయన ఈ వార్తలను ఖండించినప్పటికీ, తాజా పరిణామాలు ఆయన ప్రాజెక్టులో లేరనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరస్వతి’. మార్చి 1న ఉదయం 10:04 గంటలకు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. అయితే ఈ పాటను నయనతార రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న ‘మెగా-158’ చిత్రంపై అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. చిరు వీరాభిమాని అయిన బండ్లన్న ఎంట్రీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన పాత్ర ఫన్నీగా ఉంటుందా లేదా పవర్ఫుల్గా ఉంటుందా అన్నది సస్పెన్స్ అయినప్పటికీ, బండ్లన్న మార్క్ డైలాగులు పక్కా అని తెలుస్తోంది.
తల్లిదండ్రుల మాటలను కాదని, ప్రేమించిన వారి కోసం ఇళ్లు వదిలి వెళ్లిన ముగ్గురు అమ్మాయిల కథే ‘ది కేరళ స్టోరీ 2’. తాము నమ్మిన ప్రేమే ఒక పెద్ద మోసమని తెలుసుకున్న వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దర్శకుడు ఇందులో చూపించాడు. నటీనటుల ప్రతిభ, ఎమోషనల్ కథాంశం, సెకండాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు మూవీకి ప్లస్. కథను ఒకే కోణం నుంచి చూపడం, కొన్ని చోట్ల మితిమీరిన సినిమాటిక్ లిబర్టీ మైనస్.
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి GV ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తోంది.
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నీల్ సెడకా (86) కన్నుమూశారు. ‘బ్రేకింగ్ అప్ ఈజ్ హార్డ్ టు డూ’, ‘క్యాలెండర్ గర్ల్’ వంటి హిట్లతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల కెరీర్లో మూడు బిల్బోర్డ్ నంబర్ 1 హిట్లు సాధించిన ఆయన, 1983లో ‘సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఖరారైంది. నార్త్ అమెరికా హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిరా సినిమాస్’ సొంతం చేసుకుంది. ఇటీవల ‘OG’ని డిస్ట్రిబ్యూట్ చేసిన వీరు, ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నారు. యూఎస్లో ఏప్రిల్ 29 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. మెగా ఫ్యాన్స్లో ఈ అప్డేట్ జోష్ నింపింది.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుపై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపాడు. ఇందులో యాక్షన్ ఉంటుందని, ప్రేక్షకులకు తన నుంచి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని చెప్పాడు. 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మంచి ప్యాకేజ్తో రాబోతున్నట్లు తెలిపాడు.
టాలీవుడ్ అందాల భామ మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం. 2006లో వచ్చిన అక్షయ్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ ‘భాగమ్ భాగ్’ సీక్వెల్లో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఆమె నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్రంలో బిజీగా ఉంది.
తమిళ దర్శకుడు రా. కార్తీక్తో అక్కినేని నాగార్జున తన 100వ మూవీ చేస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ మైసూర్లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 2 వారాలకు పైగా సాగే ఈ షెడ్యూల్లో నాగ్తో పాటు కీలక సన్నివేశాలపై చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. ఇక 2026 ద్వితీయార్ధంలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీపై అంచనాలు పెరిగాయి. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీపై నటి యామీ గౌతమ్ రివ్యూ ఇచ్చింది. ఇది ‘నెక్స్ట్ లెవెల్’ మూవీ అని, ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని తెలిపింది. మూవీ చూశాక తాను వేరే దేనిపై దృష్టి పెట్టలేకపోయానంటూ పేర్కొంది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ మూవీ ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.