WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆర్తి అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజిరెడ్డి, కోశాధికారిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా పాక భాస్కర్ మల్లేశం ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల సమస్యల కోసం కృషి చేస్తామని తెలిపారు.