మలయాళ నటి లక్ష్మి మీనన్కు కేరళ కోర్టులో ఊరట లభించింది. IT ఉద్యోగినిపై దాడి కేసులో లక్ష్మితో పాటు తన ముగ్గురు ఫ్రెండ్స్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నటి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయకండి అని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమె ఫ్రెండ్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు.