»Chiranjeevi Padma Vibhushan Is A Big Event For Chiranjeevi
Chiranjeevi: పద్మ విభూషణ్ చిరంజీవి కోసం భారీ ఈవెంట్!
మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత గౌరవం దక్కడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూమెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు మెగాభిమానులు. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Chiranjeevi: ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. మెగాస్టార్గా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచి.. దాదాపు 45 ఏళ్ళుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత గౌరవం దక్కడంతో సంబరాలు చేసుకుంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం.. మెగాస్టార్ చిరంజీవికి సినీరంగానికి చేసిన సేవకుగాను పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో ప్రముఖులతో పాటు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా చిరుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టాలీవుడ్ ప్రముఖులు నటులు, నిర్మాతలు అంతా మెగాస్టార్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి చిరుని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ కోసం ఒక స్పెషల్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నాం, మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. ఇండస్ట్రీ మొత్తం చిరంజీవిని ఘనంగా సత్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకే ఈ మెగా ఈవెంట్ను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఈ ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది? ఎవరెవరు వస్తారు? టాలీవుడ్ ప్రముఖులంతా హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఈవెంట్ మాత్రం భారీ ఎత్తున ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.