‘సైయారా’తో హిట్ అందుకున్న అహాన్ పాండే, అనీత్ పడ్డా మరోసారి జంటగా కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో రాబోతున్న మూవీలో వారు నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 ఆఖర్లో ప్రారంభం కానుంది. తనదైన ముద్ర ఉన్న సంగీతంతో ప్రేక్షకులను మళ్లీ అలరిస్తానని మోహిత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీని 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.