ప్రముఖ నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వీరితో పాటు ‘అఖండ 2’ నిర్మాత గోపీ అచంట కూడా అప్పన్నను దర్శించుకున్నారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో వారిని ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం అందించారు.