తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ సరసన మీనాక్షి చౌదరి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో నటించనున్న ఈ సినిమాలో ఆమె కథానాయికగా చేయనున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. 2026 మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు, ఒకే షెడ్యూల్లో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.