కత్రినా కైఫ్ బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్. అతడి జీతం ఏడాదికి రూ.కోటి అని తెలుస్తోంది. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్పై దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల విచారణకు పిలిచింది. ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు విచారణకు వచ్చారు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్కు ఈడీ నుంచి సమన్లు అందాయి. మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ కేసులో అతనికి ఈ నోటీసు వచ్చింది. అక్టోబర్ 6న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఈ సమన్లు జారీ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ టీజర్ విడుదలైంది. ఇక వీడియో మాత్రం మాములుగా లేదు. కంప్లీట్ బ్లడ్ బాత్ అని చెప్పవచ్చు. ఇక థియేటర్లో ఈ సినిమాకు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
జాన్వీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. బాలీవుడ్ లో ఆమె చాలా సినిమాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అక్కడ మంచి హింట్ అందుకోలేకపోయింది. దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.
స్టార్ డైరెక్టర్ శంకర్తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. మూవీ మేకర్స్ కోట్లు కుమ్మరించాల్సిందే. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడు డైరెక్టర్ శంకర్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు.. అనుకున్న ఔట్ పుట్ రావాల్సిందే. అంతేకాదు.. సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలన్నా కూడా శంకర్దే డెసిషన్. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజునే చెప్పడం విశేషం.
టిల్లుగాడి లవర్ రాధికాను అంత ఈజీగా మరిచిపోలేరు. మన టిల్లుగాడు సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్గా రాధికా పాత్రలో నటించింది హాట్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాతో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. కానీ సీక్వెల్లో మాత్రం ఛాన్స్ అందుకోలేదు. అయితే క్లైమాక్స్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతోందట రాధికా.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఖుషి. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. అలాగే శాకుంతలంతో ఫ్లాప్ అందుకున్న సమంత కూడా భారీ ఆశలే పెట్టుకుంది. డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఖుషితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చేసింది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనిపించక మానదు. అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. ఉన్న ఆఫర్లు కూడా పొగొట్టుకుంటోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చేశాడు. దీంతో పూజా పరిస్థింతేటనేది హాట్ టాపిక్గా మారింది.
స్టార్ బ్యూటీ సమంత గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్గా మారుతుంది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసిన సరే.. హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సామ్ అమెరికాలో ఉంది. అయినా కూడా అమ్మడి పై ట్రోలింగ్ ఆగడం లేదు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా రిలీజ్ అయితే తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ చేయలేకపోయాడు సూర్య. కానీ తాజాగా భారీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కేజీయఫ్ తర్వాత హోంబలే ఫిలింస్కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు కాంతార 2ని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. తాజాగా మరో బ్యూటీ కూడా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది.