బాహుబలి2లో 'వీడెక్కడున్న రాజేరా' అని చెప్పిన డైలాగ్ ప్రభాస్(Prabhas)కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ విషయంలో రెబల్ స్టార్ అభిమానులు కాలర్ ఎగరెస్తుంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫ్యాన్స్ విషయంలో ప్రభాస్ కేరింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక అంతకుమించి అన్నట్టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ను చూస్తుంటాడు డార్లింగ్.. తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు.
హ్యాపీ డేస్ మూవీతో హీరోగా మారాడు వరుణ్ సందేశ్(Varun Sandesh). ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో వరుణ్ కి వరస ఆఫర్లు వెల్లువెత్తాయి. వరసగా కొన్ని హిట్లు కూడా పడ్డాయి. కానీ ఆ తర్వాత వరసగా ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరో రోల్స్ కూడా చేశాడు. అవి కూడా కలిసి రాలేదు. దీంతో సినిమాలు అన్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు.
భారతీయుడి కంటే భారతీయుడు 2 చిత్రం పది రెట్లు ఎక్కువ ఉంటుందని హీరో సిద్ధార్థ్(hero siddharth) అంటున్నారు. అంతేకాదు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరసన తనకు నటించే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
నిహారిక కొణిదెల(niharika konidela) తన ఇన్ స్టాఖాతాలో కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అని తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ చిత్రాలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
హిట్ మూవీ మసూదా ఫేమ్ తిరువీర్, హీరోయిన్ పావని కర్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పరేషాన్. ఈ మూవీ ఈరోజు(జూన్ 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానా సమర్పించగా..రూపక్ రోనాల్డ్సన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
రిలీజ్కు ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఆదిపురుష్ మూవీ. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీగా అంచనాలను పెంచేశాయి. దాంతో ఆదిపురుష్కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. తిరుపతిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను కనీవినీ ఎరుగని వధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయట.
యంగ్ హీరో నిఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మూవీ పేరు స్వయంభు కాగా.. ఆ పోస్టర్ మీద నిఖిల్ ఓ యుద్ధవీరుడిలా కనిపిస్తున్నాడు.
రామ్ గోపాల్ వర్మ ‘వ్యుహం’ మూవీలో నటించే హీరోయిన్ పాత్రను పరిచయం చేశారు. వైఎస్ భారతి పాత్రను మానస రాధాకృష్ణన్ చేస్తారని ప్రకటించారు.
డైరెక్టర్ పరశురామ్ తమను కూడా ఛీట్ చేశాడని అంటోంది 14 రీల్స్ సంస్థ. తమతో మూవీ తీస్తానని చెప్పి.. దిల్ రాజుతో సినిమా తీస్తున్నారని ఆరోపించింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ-సమంత కలిసి ఖుషి మూవీలో నటిస్తున్నారు. షూటింగ్ టర్కీలో జరుగుతుండగా.. షూట్ గ్యాప్లో ఇద్దరు లంచ్, డిన్నర్ కోసం బయటకు వెళుతున్నారు.
వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఆ మూవీ. ఆ సినిమా తర్వాత 'భోళా శంకర్' మూవీ చేస్తున్నారు చిరంజీవి. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ మేనియా స్టార్ట్ అయిందని.. ఫస్ట్ సింగిల్ అప్టేడ్ ఇచ్చారు మేకర్స్.
మళయాళి క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్కు యూత్లో యమా క్రేజ్ ఉంది. తక్కువ కాలంలో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ జనరేషన్ యూత్లో అనుపమా డీపి లేని మొబైల్ ఫోన్ ఉండదేమో. కుర్రాళ్ల కలల రాకుమారి అనుపమా. అలాంటి ఈ బ్యూటీ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే న్యూస్ వైరల్గా మారింది. అసలు మ్యాటర్ వేరే అని తెలియడంతో.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
హ్యాపీడేస్ మూవీతో తెరంగ్రేటం చేసి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిఖిల్. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు 'గుంటూరు కారం' టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ.. సాలిడ్ మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేశారు. సన్నకర్ర సవ్వా దెబ్బ.. బీడి త్రీడిలో కనిపిస్తుందా.. అంటూ మహేష్ బాబు చేసిన రచ్చ మామూలుగా లేదు. కానీ తమనే మళ్లీ కాపీ కొట్టి దొరికిపోయాడంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
కొందరు దర్శకులు గీత దాటుతారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ ఇచ్చారు. మాట ఇచ్చి తప్పుతారని అన్నారు. దర్శకుడు పరశురామ్ గురించి అల్లు అరవింద్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.