చిన్న సినిమాల విడుదలకు అడ్డుగా మారిన స్టార్ హీరోల రీరిలీజ్లు. ఒత్తిడి తట్టుకోలేక చిన్ననిర్మాతల ఇబ్బందులు పడుతున్నారు. ఓ నిర్మాత తనువు చాలించాడు.
నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా పూజా హెగ్డే పేరే వినపడేది. మొన్నటి వరకు ఆమె జోరు అలా సాగింది. ఇప్పుడే కాస్త డల్ అయ్యింది. రెండు, మూడు సినిమాల ఛాన్సులు చేతుల వరకు వచ్చి చేజారాయి. కానీ లేకుంటే మరో రెండు ఏళ్లు పూజాకి తిరుగు ఉండేది కాదు.
మహేష్ కుటుంబం వ్యక్తిగతంగా ఈ మధ్య కాలంలో చాలా విధాలుగా నష్టపోయింది. మహేష్ బాబు అద్భుతమైన బ్లాక్బస్టర్లను అందించడం, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం మాత్రమే కాకుండా కుటుంబ వ్యక్తిగా కూడా పేరు పొందాడు. అతను తన కుటుంబ సభ్యులు భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారతో మాత్రమే కాకుండా తన సిబ్బందితో కూడా మంచి సంబంధాలు, బంధాన్ని పంచుకుంటాడు.
ఇస్మార్ట్ బ్యూటీగా తన గ్లామర్తో కుర్రకారును కట్టిపడేసింది నిధి అగర్వాల్(nidhi agarwal). ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రొమాన్స్ చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి అభిమానులు నల్గొండలో ఘన స్వాగతం పలికారు. తమ మామకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించేందుకు ఆయన వచ్చారు.
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్(re release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేసి..ఊహించని లాభాలు చూస్తున్నారు నిర్మాతలు. అయితే కొందరు ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అది బాలయ్య నుంచి రెండు ఫ్లాప్ మూవీస్ రీ రిలీజ్ అనడమే..మరీ అరాచకంగా ఉంది.
రాజ్ డీకేల కొత్త వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ నెట్ ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్యాంగ్ స్టర్, స్మగ్లింగ్ నేపథ్యంలో సిరీస్ సాగుతోంది.
ప్రతి ఒక్క హీరో ప్రతి సినిమాతో సక్సెస్ కాకపోవచ్చు. కొన్ని ప్లాపులు కూడా పలకరిస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో వారు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే లోకేశ్ కనగరాజ్తో కలిసి విక్రమ్తో కమల్ హాసన్ అద్భుతమైన హిట్ సాధించగా రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్తో కలిసి జైలర్తో హిట్ సాధించాడు.
హార్ట్ఎటాక్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. సెలబ్రెటీలు గుండెపోటులకు గురవుతున్నారు. తమిళ టీవీ నటుడుకి స్ట్రోక్ వచ్చి మరణించాడు.
ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే, గేమ్ ఛేంజర్ తప్ప మరే తెలుగు చిత్రానికి సంతకం చేయలేదని కియారా అద్వానీ(Kiara Advani) వారిని నిరాశపరిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2లో తాను భాగమని, అయితే తాను ఎన్టీఆర్ ప్రేమికురాలిగా నటించడం లేదని ఆమె తెలిపారు.
దర్శక ధీరుడు రాజమౌళి(ss rajamouli) అంటే ఇప్పుడో బ్రాండ్. ఆయన ఏం చేసినా సెన్సేషనే. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్కు తీసుకెళ్లాడు. అయితే రాజమౌళికి కూడా కొన్ని తీరని కోరికలు ఉంటాయి. తాజాగా అందులో ఓ కోరిక తీరిపోయిందని చెప్పిన జక్కన్న.. అభిమానులను భయపెట్టినంత పని చేశాడు.
హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం(Brahmanandam). ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ(Siddharth) నిన్న(august 18th) ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్లు వేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.
షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి వారు బాలీవుడ్ ను నాశనం చేశారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. 'ఈ వ్యక్తులు భారతదేశంలోని నిజమైన కథలను సినిమా నుండి తొలగించారు. షాహెన్షా, దీవార్ వంటి చిత్రాల తర్వాత నిజమైన కథలు బాలీవుడ్ చిత్రాల నుండి అదృశ్యమయ్యాయని అగ్నిహోత్రి అన్నారు.
టిల్లుగాడి లవర్ రాధికాను అంత ఈజీగా మరిచిపోలేరు. మన టిల్లుగాడు సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్గా రాధికా పాత్రలో నటించింది హాట్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాతో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. కానీ సీక్వెల్లో మాత్రం ఛాన్స్ అందుకోలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ముగ్గరు యంగ్ హీరోలతో కలిసి బ్యాక్ టు బ్యాక్ రాబోతోంది.
ఈ మధ్య కాలంలో థియేటర్లోకి వచ్చిన పెద్ద సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో', మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', సూపర్ స్టార్ 'జైలర్' సినిమా అని చెప్పొచ్చు. వచ్చే నెలలో మాత్రం థియేటర్లో జాతర జరగబోతోంది. ఏకంగా పది సినిమాల వరకు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.