బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్త్రీ-2’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రూ.349 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చు. ఇక ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందిన ‘దేవర’ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ సంగీత దర్శకుడు అనిరుధ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను గుర్తుచేస్తుందని.. కచ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. చాలా సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెప్పాడు. అభిమానులతో కలిసి తనకు ఈ సినిమా చూడాలనుందని ...
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్టు 29న రిలీజై దాదాపు రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా తాజాగా OTTలోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ మూవీలో ఎస్.జె సూర్య విలన్గా నటించగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్&z...
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రద్దయిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలని వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై విపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ కూడా ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో క్షమాపణలు చెప్పిన ఆమె.. తాను కళాకారిణి మాత్రమే కాకుండా BJP ఎంపీననే విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుండేది. అయితే, ఇలాంటి వ్యాఖ్యలతో వివాదంలో చ...
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి మరో అరుదైన అవకాశం దక్కింది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ‘కల్కి’ ఎంపికైంది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓపెన్ సినిమా విభాగంలో మూవీని ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలో BIFFలోని అతిపెద్ద బహిరంగ థియేటర్లో...
ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ ఈనెల 27న విడుదల కానున్న నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి మిడ్ నైట్ షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే విశాఖలోని పూర్వీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ స్వయంగా బెనిఫిట్ షోకు బ్లాక్లో టిక్కెట్లు విక్రయిస్తోంది. ఒక్కో టిక్కెట్ను ఏకంగా రూ.వెయ్యికి అమ్ముతోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చినా.. థియేటర్లకు సినిమాలు ఇవ్వరన్న భయంతో య...
మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డెరెక్షన్ డిపార్టుమెంట్లో స్టార్ హీరో రవితేజ కుమారుడు మహాధన్ చేరాడు. రవితేజ తన సినీ కెరీర్ను అసెస్టింట్ డైరెక్టర్గా మొదలుపెట్టగా.. ఆయన కుమారుడు సైతం అసిస్టెంట్ డెరెక్టర్గానే తన సినీ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ కోసం మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయనున...
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘వెట్టయాన్’. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర యూనిట్ ‘వేట్టయాన్ ప్రివ్యూ’ పేరుతో తెలుగు టీజర్ను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున...
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్, తమిళ హీరో కార్తీల మాటలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆలోచించి మాట్లాడాలని వారిపై ఫైర్ అయ్యారు కూడా. పవన్ వ్యాఖ్యలకు స్పందించిన కార్తీ.. ట్విటర్ వేదికగా క్షమించాలని కోరాడు. తాజాగా దీనిపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు. “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్కు కౌంటర్...
అత్యాచారం కేసులో మలయాళ నటుడు ఇడవేలు బాబు అరెస్ట్ అయ్యారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాబు మూవీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో.. సభ్యత్వం నిమిత్తం కలూర్లోని ఆయన ఇంటికి వెళ్లగా.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ OTT రిలీజ్పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. దీని డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. మూవీ థియేటర్లలో విడుదలైన 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు సదరు సంస్థతో మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. దీంతో థియేట్రికల్ రన్ జరిగిన...
స్టార్ హీరోయిన్స్ సమంత, ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్లో కనిపించారు. సమంత, వరుణ్ ధావన్ కాంబోలో సిటాడెల్ సిరీస్ రాబోతుంది. తాజాగా లండన్లో ఈ సిరీస్ ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సామ్తో పాటు ప్రియాంక కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సిరీస్ ప్రియాంక నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్కు రీ...
AP: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపుదలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరల పెంపునకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు వెలువరించింది. కాగా 14 రోజుల పాటు టికెట్ ధరలను మల్టీప్లెక్స్లో రూ.135, సింగిల్ థియేటర్లలో రూ.110 పెంచుకునేలా ప్రభు...
గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ను ఉద్దేశించి నటి, యాంకర్ రష్మీ మాట్లాడిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన రష్మీ ట్వీట్ చేసింది. 2020 కంటే ముందే ఈ ఇంటర్వ్యూను ఇచ్చానని, దయచేసి ఇప్పుడు ఆ వీడియోను వాడొద్దని కోరింది. దీన్ని వైరల్ చేస్తూ నెటిజన్లను తప్పుదోవ పట్టించొద్దని పేర్కొంది. ఏదైనా విషయంలో ఓ మహిళ నో అని చెబితే.. దాన్ని గౌరవించాలని పేర్కొంది.