AP: శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి భారీగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. పాదయాత్రగా కన్నడిగులు నల్లమల అడవుల నుంచి వస్తున్నారు. ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరపనున్నారు. భారీగా వస్తున్న భక్తుల రద్దీతో ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా రేపటి నుంచి 31 వరకు స్వామివారి స్పర్శదర్శనానికి అనుమతిలేదు.