MDK: దేశ ప్రజలకు సేవలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదునపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజును కొనియాడారు. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలన్నారు.
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్గా బాలకోటి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని, వార్డుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని.. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కౌన్సిలర్ల సహకారంతో కృషి చేస్తానని చెప్పారు.
BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోషల్ మీడియా యువజన కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని పేర్కొన్నారు. యువజన శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
HYD: సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్-2026 3వ రోజూ అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగింది. వివిధ జిల్లాలు, జోన్లు, కమిషనరేట్లు,స్పెషల్ ఫోర్సెస్ నుంచి తరలివచ్చిన వందలాది మంది పోలీస్ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యంతో మైదానాన్ని హోరెత్తించారు. వాలీబాల్, కబడ్డీ వంటి ప్రధాన విభాగాలలో గెలుపే లక్ష్యంగా పోటీపడ్డారు.
కామారెడ్డిలోని ‘భరోసా’ సెంటర్ నిర్వహణ బాధ్యతలను మహిళా ఎస్సై శ్రావంతికి అప్పగిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మహిళా ఎస్సై జి. జ్యోతి అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు అందుతున్న సేవలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వేళ తన వార్డులోని ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ. 10,016లు ఆర్థిక సాయం అందిస్తానని వాగ్దానం చేశారు. అంబేద్కర్ నగర్కు చెందిన సుంకరి రాజేశ్వరి వివాహనికి ఇవాళ హాజరై, ఆ నగదును అందించారు.
SRCL: రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన, దిశ నిర్దేశం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దుర్గరాజు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో రసాయనాలను తగ్గించాలన్నారు.
BHNG: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం రూ.20,47,905 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవాని శంకర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.6,55,700, లీజులతో రూ.5,35,400, కార్ పార్కింగ్తో రూ.2,27,000, VIP దర్శనాలతో రూ.1,50,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,02,900, వ్రతాలతో రూ.1,01,000, కళ్యాణకట్ట రూ.49,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామం చెందిన ఆర్మీ అధికారి, జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట సాహితీ ప్రతిభా పురస్కారం 2026ను హైదరాబాద్లో రవీంద్రభారతిలో శుక్రవారం అందుకున్నారు. ఆయన చేస్తున్న అవిరళ విశిష్ట సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా పురస్కారం ప్రదానం చేశారు.
NZB: కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ది వరుణ్, అక్షర రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కనక గంగాధర్ తెలిపారు. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు.
MHBD: పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి పాస్, ఫెయిల్ అయిన యువతీ, యువకుల కోసం శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు తొర్రూరు మండల కేంద్రంలోని సమత డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కోఆర్డినేటర్ స్రవంతి తెలిపారు. ఆసక్తి గలవారు 9063484855 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి నిజామాబాద్ అనుబంధ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
MNCL: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే చలో హైదరాబాదును విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు అంబటి సువర్ణ కోరారు. శుక్రవారం జన్నారంలోని సీఐటీయు కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు.
MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోల్కొండ కిషన్ రావు దేశ్ముఖ్ గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కోసం భూమిని దానంగా అందజేశారు. 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రావు దేశ్ముఖ్ పేర్కొన్నారు. సర్పంచ్ జ్యోతి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, పూజారి రమణచార్యులు పాల్గొన్నారు.